భువనగిరి అర్బన్, జూలై23: అర్హులందరూ రెండో డోస్ టీకా తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆం జనేయులు అన్నారు. శుక్రవారం ఆయన పట్టణంలోని 5, 6, 7, 18, 33, 34వ వార్డుల్లో చేపట్టిన టీకా పంపిణీ కార్యక్రమాలను ప్రారంభించి మాట్లాడారు. వార్డుల్లో మొదటి డోసు తీసుకున్న వారు రెండో డోసు తీసుకునేలా వార్డు ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, ఆయా వార్డు కౌన్సిలర్లు కిరణ్కుమార్, అనురాధాపాండు, భగత్, అందె శంకర్, క్రాం తి, దుర్గాభవాని, రాజేశ్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
రామన్నపేటలో 500మందికి టీకా
రామన్నపేట, జూలై23: రామన్నపేట ప్రభుత్వ దవాఖానకు శుక్రవారం ప్రజలు అధిక సంఖ్యలో కొవిడ్ వ్యాక్సిన్ కోసం తరలివచ్చారు. జనం రద్దీని దృష్టిలో పెట్టుకొని వైద్యాధికారి రవికుమార్ స్త్రీ, పురుషులకు వేర్వేరుగా రిజిస్ట్రేషన్, వ్యాక్సినేషన్ కౌంటర్లను ఏర్పాటు చేయించారు. సాయంత్రం వరకు 500 మందికి కొవిడ్ టీకాను వేసినట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో సూపర్వైజర్ వాణిశ్రీ, ఏఎన్ఎంలు పుష్పకళ, గీత, మంజుల, రజిత, కేతమ్మ, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
మోత్కూరులో 400 మందికి..
మోత్కూరు, జూలై23: మండలంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. మండల కేంద్రంలోని పీహెచ్సీలో 130 మందికి, దాచారంలోని సెంటర్ లో 130 మందికి, దత్తప్పగూడెంలోని వ్యాక్సినేషన్ కేం ద్రంలో 140మందికి శుక్రవారం మొత్తం 400 మందికి కొవిడ్ టీకాను వైద్యసిబ్బంది పంపిణీ చేసినట్లు వైద్యాధికారి డాక్టర్ చైతన్యకుమార్ తెలిపారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది అరుణకుమారి, రాములమ్మ, సైదమ్మ, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.