మునుగోడు, నవంబర్ 6 : మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపును హర్షిస్తూ నల్లగొండ, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల్లో ఆ పార్టీ శ్రేణులు ఆదివారం ఘనంగా సంబురాలు నిర్వహించుకున్నా రు. పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు.
గట్టుప్పల్ : గట్టుప్పల్ మండల కేంద్రంలోని చౌరస్తాలో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, సర్పంచ్ ఇడెం రోజా, ఎంపీటీసీలు చెరుపల్లి భాస్కర్, అవ్వారి గీతాశ్రీనివాస్, ఈడెం కైలాసం పాల్గొన్నారు. గట్టుప్పల్ను కొత్త మండలంగా ప్రకటించిప సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, గుంటకండ్ల జగదీశ్రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
మర్రిగూడ: మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపును హర్షిస్తూ మండలంలోని ఖుదాభక్ష్పల్లిలో టీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. డప్పుల దరువులు, కోలాట ఆటపాటల మధ్య బతుకమ్మలు, బోనాలను ఊరేగిస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పాశం సురేందర్ రెడ్డి, సర్పంచ్ ఆంబోతు సుధాకర్ నా యక్, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు పందుల పాండు గౌడ్, ఉప సర్పంచ్ మైలారపు పార్వతమ్మాగిరీశ్, శేఖర్ గౌడ్ పాల్గొన్నారు.
నాంపల్లి: దామెర, గౌరారం, నాయకన్తండా, నాంపల్లిలో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జ రుపుకున్నారు. ర్యాలీలు నిర్వహించారు
నల్లగొండలో..
రామగిరి : టీఆర్ఎస్ గెలుపు ను హర్షిస్తూ నల్లగొండలో టీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. కౌటింగ్ కేంద్రంలో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ గజమాలతో సన్మానించారు. స్వీట్ తిని పించారు
తిప్పర్తి : ఇండ్లూరు గ్రామంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబురాలు నిర్వహించారు. పటాకులు కాల్చి ,మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నాగుల వంచ విజయలక్ష్మి, నాగులవంచ లింగరావు, నర్సింహారావు, వలిశెట్టి మల్లయ్య, సోమయ్య పాల్గొన్నారు.
నకిరేకల్లో ..
నకిరేకల్ : నకిరేకల్ పట్టణంలో టీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు అంబరాన్నంటాయి. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య క్యాంపు కార్యాలయం నుంచి పట్టణకేంద్రంలో పటాకులు కాల్చి స్వీట్లు తినిపించకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మురారిశెట్టి ఉమారాణీకృష్ణమూర్తి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రగడపు నవీన్రావు, ప్రధాన కార్యదర్శి నోముల కేశవరాజు, పట్టణాధ్యక్షుడు యల్లపురెడి సైదిరెడ్డి, కౌన్సిలర్లు కందాల భిక్షంరెడ్డి, రాచకొండ సునీల్, చింత స్వాతీశివమూర్తి, కొండ శ్రీను, చౌగోని అఖిలాలక్ష్మణ్, బానోతు వెంకన్న, పోతుల సునీతారవీందర్, గడ్డం స్వామి, గర్షకోటి సైదులు, పల్లె విజయ్, చౌగోని రాములమ్మాసైదులు, ముత్యాలమ్మగుడి ఛైర్మన్ నడికుడి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ గుర్రం గణేశ్, దళితబంధు జిల్లా కోఆర్డినేటర్ దైద పరమేశ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కట్టంగూర్ : కట్టంగూర్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబురాలు నిర్వహించారు కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాములు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు, పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ, ఉప సర్పంచ్ అంతటి శ్రీను, నాయకులు బొల్లెద్దు యాదయ్య, పులిగిల్ల వెం కన్న, గుండగోని రాములు, మల్లబోయిన కృష్ణ, పోతరాజు నగేశ్, రెడ్డిపల్లి మనోహర్, కానుగు లిం గయ్య, ఊట్కూరి శంకర్, పులకరం కొండల్, జిల్ల యాదయ్య పాల్గొన్నారు.
చిట్యాల : చిట్యాలలో పటాకులు, కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్రెడ్డి, వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, నాయకులు పొన్నం లింగస్వామి, జిట్ట చంద్రకాంత్, బెల్లి సత్తయ్య, కోనేటి కృష్ణ, జిట్ట నగేశ్, అవిశెట్టి శంకరయ్య, లింగయ్య పాల్గొన్నారు.
కేతేపల్లి : మండలంలోని కొత్తపేట గ్రామంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, రైతులు పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకున్నారు.ఈ సం దర్భంగా పటాకులు కాల్చి, స్వీట్లు పంచి పెట్టారు. కార్యక్రమంలో పార్టీ గ్రామ అధ్యక్షుడు రాచకొండ సైదులుగౌడ్, సర్పంచ్ బచ్చు జానకీరాములు, ఉపసర్పంచ్ తండు రాములుగౌడ్, పలువురు నాయకులు పాల్గొన్నారు.
శాలిగౌరారం : మండల కేంద్రంలో పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. కార్యక్రమం లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐతగోని వెంకన్నగౌడ్, కట్టా వెంకట్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ తాళ్లూరి మురళి, గుజిలాల్ శేఖర్బాబు, బట్ట వీరబాబు, జెర్రిపోతుల చంద్రమౌళిగౌడ్, బైరు నాగరాజుగౌడ్, మామిడి రమేశ్, చిర్రబోయిన శ్రీనివాస్, నిమ్మల సురేశ్గౌడ్, రవిగౌడ్, పాల్గొన్నారు.