వలిగొండ, మార్చి 13 : ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి దివంగత టీఆర్ఎస్ నాయకుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మారగోని జంగాల్గౌడ్ అందించిన సేవలు మరువలేవని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సాయి గణేశ్ ఫంక్షన్హాల్లో మండల పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన జంగాల్గౌడ్ ప్రథమ వర్ధంతి సభలో వారు మాట్లాడారు. జంగాల్గౌడ్ కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉండి ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఆయన కుమార్తెల చదువుకు పూర్తి ఆర్థిక సాయం అందిస్తానని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి తెలిపారు. అంతకుముందు జంగాల్గౌడ్ స్మారక స్థూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పైళ్ల రాజవర్ధన్రెడ్డి, వంగాల వెంకన్న, మాజీ జడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ పనుమటి మమతానరేందర్రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ కునపురి కవిత, మత్స్యగిరి గుట్ట చైర్మన్ ముద్దసాని కిరణ్రెడ్డి, భువనగిరి నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు గూడూరు శేఖర్రెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు లింగస్వామి, మహిళా విభాగం అధ్యక్షురాలు మద్దెల మంజుల పాల్గొన్నారు.