యాదాద్రి, జూన్10 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శుక్రవారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని స్వామివారికి లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చకబృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో పుష్పార్చన పూజలు చేశారు. పూజల్లో దేవస్థాన ఉప ప్రధానార్చకులు, వేద పండితులు, అర్చకబృందం పర్యవేక్షకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. స్వయంభూ ప్రధానాలయంలో సాయంత్రం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు. ప్రధానాయంలోని వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మీఅమ్మవారిని పూలు, పట్టువస్ర్తాలతో దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు.
స్వయంభూ నారసింహుడిని ప్రధానాలయంలోని వెలుపలి ప్రాకారం అద్దాల మండపంలో ఊయలలో శయనింపు చేయించారు. అర్చక బృందం స్వయంభూ స్వామివారికి నిత్యారాధనలు చేపట్టారు. తెల్లవారు జాము మూడు గంటల నుంచే నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం నాలుగు గంటలకు ఆలయాన్ని తెరిచి సుప్రభాత సేవ నిర్వహించారు. బిందె తీర్థం నిర్వహించి లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
ఉదయం సుదర్శన నారసింహహోమం నిర్వహించిన అర్చకులు స్వామి, అమ్మవార్లకు ప్రాకార మండపంలోని నిత్య తిరుకల్యాణోత్సవాన్ని వైభవంగా జరిపించారు. కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారి నిజాభిషేకం, సహస్రనామార్చన జరిపారు. స్వయంభూల ప్రధానాలయంలోని ముఖ మండపంలో పలువురు భక్తులకు సువర్ణపుష్పార్చన జరిపించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉచిత దర్శనాలు కొనసాగాయి.
పాతగుట్ట ఆలయంలో స్వామి, అమ్మవార్ల నిత్య పూజలు కొనసాగాయి. శ్రీవారి ఖజానాకు శుక్రవారం రూ.20,59,426 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. స్వామివారిని దర్శించుకున్న ఆడిట్ జనరల్ డిప్యూటీ కంట్రోలర్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని ఆడిట్ జనరల్ డిప్యూటీ కంట్రోలర్ శ్రీనివాసన్ కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికి, దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం ఇవ్వగా, ఆలయ అధికారులు ప్రసాదం అందజేశారు.
యాదాద్రి, జూన్10: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి స్వయంభూ ప్రధానాలయంలో నమ్మాళ్వార్ తిరునక్షత్ర ఉత్సవాలు శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ప్రధానాలయ ముఖ మండపంలో ఆళ్వారు విగ్రహాలను దివ్య మనోహరంగా అలంకరించి తొళక్కం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు నల్లన్థీగళ్ లక్ష్మీనరసింహచార్యులు, మోహనాచార్యులు పాల్గొన్నారు.
శ్రీవారి ఖజానాకు ఆదాయం
(రూపాయల్లో)
ప్రధాన బుకింగ్ ద్వారా 2,30,150
వీఐపీ దర్శనం 1,35,000
వేద ఆశీర్వచనం 12,600
నిత్య కైంకర్యాలు 1,400
సుప్రభాతం 1,400
క్యారీబ్యాగుల విక్రయం 15,400
వ్రత పూజలు 1,32,800
కల్యాణకట్ట టిక్కెట్లు 34,000
ప్రసాద విక్రయం 8,71,740
వాహన పూజలు 15,200
అన్నదాన విరాళం 63,798
శాశ్వత పూజలు 25,000
సువర్ణ పుష్పార్చన 1,07,548
యాదరుషి నిలయం 1,00,250
పాతగుట్ట నుంచి 37,340
కొండపైకి వాహనాల ప్రవేశం 2,75,000
లక్ష్మీపుష్కరిణి 800