ఆలేరు, మే16 : డెంగీ నివారణకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారీ సూచించారు. జాతీయ డెంగీ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆలేరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం జెండా ఊపి డెంగీ నివారణ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి మల్లికార్జున్రావు మాట్లాడుతూ.. డెంగీ వ్యాప్తి, నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. పగటిపూట కుట్టే దోమలతో డెంగీ సోకుతుందని పేర్కొన్నారు.
పరిసరాలు, డ్రైనేజీలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇండ్లల్లో కొబ్బరి చిప్పలు, పాత టైర్లు లేకుండా చూసుకోవాలన్నారు. కూలర్లు, పూలకుండీల్లోని నీటిని తరచూ మార్చాలని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రశాంత్, సుమన్, చిన్నానాయక్, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
మోటకొండూర్ : స్థానిక పీహెచ్సీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో జాతీయ డెంగీ నివారణ దినోత్సవ ర్యాలీని నిర్వహించారు. మండల వైద్యాధికారి రాజేందర్నాయక్, హెచ్ఈఓలు ప్రవీణ్కుమార్, నర్సయ్య, పీహెచ్ఎన్ దేవావర, ఏఎన్ఎం ధనమ్మ పాల్గొన్నారు.
బొమ్మలరామారం : మండల కేంద్రంలో వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో డెంగీ నివారణ ర్యాలీ నిర్వహించారు. సిబ్బంది పాల్గొన్నారు.
ఆలేరు రూరల్ : 8వ విడుత హరితహారానికి నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ దీపక్తివారీ సూచించారు. సోమవారం మండలంలోని మందనపల్లిలో పల్లె ప్రగతి పనులను తనిఖీ చేశారు. ఎండలు విజృంభిస్తున్న నేపథ్యంలో మొక్కలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జ్ఞానప్రకాశ్రావు, సర్పంచ్ కోటగిరి పాండరి, ఉప సర్పంచ్ జంపాల సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి మహేందర్ పాల్గొన్నారు.