వెయ్యేండ్లు వర్ధిల్లేలా ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించారని, ఈ మహాకార్యంలో ఇండ్లు, షాపులు, స్థలాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం ఎప్పుడూ అండగానే ఉంటుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. అంజనాపురికాలనీకి చెందిన నిర్వాసితులు 169 మందిలో 159 మందికి శనివారం ఆమె ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. మిగిలిన 10 మందికి త్వరలోనే అందించనున్నట్లు తెలిపారు.
యాదాద్రి, ఆగస్టు 13 : వెయ్యేండ్లు గుర్తిండిపోయేలా ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్టను పునర్నిర్మించారని, ఈ మహాకార్యంలో ఇండ్లు, షాపులు, స్థలాలు కోల్పోయిన వారిని ఇబ్బంది పెట్టమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. శనివారం యాదగిరిగుట్ట పట్టణంలో యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా ఇండ్లు, స్థలాలు కోల్పోయిన అంజనాపురి కాలనీ వాసులు 169 మందిలో 159 మందికి ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మిగతా 10 మందికి కూడా త్వరలోనే పట్టాలు అందిస్తామని తెలిపారు. అంజనాపురి కాలనీ వాసుల కోరిక మేరకు 314 సర్వే నంబర్లో ఇండ్లను మంజూరు చేశామని చెప్పారు. కోల్పోయిన ఇండ్ల స్థలాలకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లను తాసీల్దార్కు అప్పగిస్తే ఇండ్ల పట్టాల పంపిణీ జరుగుతుందన్నారు. పట్టాల పంపిణీ పారదర్శకంగా జరిగిందన్నారు. కొంతమంది కావాలని చేసే దుష్పచారాలను నమ్మొద్దని సూచించారు. యాదాద్రి ఆలయాన్ని విస్తరించాలన్న సంకల్పంతో పట్టణంలో ప్రధాన రోడ్డు, వైకుంఠ ద్వారం ఇరువైపులా షాపులు, కొండ చుట్టూ నిర్మించిన వలయ రహదారుల చుట్టూ ఇండ్లను తొలగించాల్సి వచ్చిందన్నారు.
భూములు, ఇండ్లు, స్థలాలు కోల్పోయిన వారికి నష్టపరిహారంతో పాటు వైటీడీఏ పరిధిలో ప్లాటు, కొండకింద నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్లో షాపు కేటాయించినట్లు చెప్పారు. స్వామివారి వైకుంఠ ద్వారం నుంచి పాతగుట్ట రోడ్డు వరకు, అంజనాపురి, గాంధీనగర్, నల్లపోచమ్మవాడ ప్రధాన రోడ్డు, హనుమాన్ ఆలయ ప్రాంతం, పాత చెక్పోస్టు, తులసీ కాటేజీ ప్రాంతంలో నిర్వాసితులకు గతంలోనే ఇండ్ల స్థలాల ప్రొవిజినల్ సర్టిఫికెట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధాహేమేందర్గౌడ్, తాసీల్దార్ రాము, పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రామచంద్రారెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పెలిమెల్లి శ్రీధర్గౌడ్ పాల్గొన్నారు.