యాదాద్రి, జూలై 25 : యాదాద్రి స్వయంభూ ప్రధానాలయంలోసోమవారం లక్ష్మీనారసింహుడికి అర్చకులు నిత్యోత్సవాలు వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన నిర్వహించారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేశారు. స్వామివారి సువర్ణపుష్పార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు.
సుదర్శన ఆళ్వార్లను కొలుస్తూ హోమం, మొదటి ప్రాకార మండపంలోస్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం వైభవంగా జరిపారు. కల్యాణోత్సవంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజల వైభవంగా నిర్వహించారు. కొండకింద దీక్షాపరుల మండపం వద్ద గల వ్రత మండపంలో సత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి.
కొండపై ఉన్న శ్రీపర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామివారికి అర్చకులు, పురోహితులు అభిషేక పర్వాలు అత్యంత వైభవంగా జరిపారు. సోమవారం కావడంతో గర్భాలయంలోని లింగేశ్వర కుటుంబంతో పాటు ఆలయంలో నూతనంగా ప్రతిష్ఠించిన స్పటిక లింగేశ్వరుడికి ప్రభాతవేళ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని సుమారు గంటన్నర పాటు జరిపారు.
శివాలయం ప్రధాన పురోహితులు ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణ జరిపారు. సాయంత్రం రామలింగేశ్వరుడి సేవను శివాలయ మాఢవీధుల్లో ఊరేగించారు. అన్ని విభాగాలను కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.22,93, 530 ఆదా యం సమకూరిందని ఈఓ ఎన్. గీత తెలిపారు.
ప్రధాన బుకింగ్ ద్వారా 1,11,300
వీఐపీ దర్శనాలు 90,000
వేద ఆశీర్వచనం 10,800
క్యారీబ్యాగుల విక్రయం 7,300
వ్రత పూజలు 23,200
కళ్యాణకట్ట టిక్కెట్లు 12,600
ప్రసాద విక్రయం 6,49,020
వాహనపూజలు 4,800
అన్నదాన విరాళం 18,624
శాశ్వత పూజలు 30,000
సువర్ణ పుష్పార్చన 1,04,716
యాదరుషి నిలయం 23,800
పాతగుట్ట నుంచి 8,900
కొండపైకి వాహన ప్రవేశం 2,50,000
లక్ష్మీ పుష్కరిణి 400
శివాలయం 3,800
లీసెస్, లీగల్ 9,42,770