మునుగోడు, డిసెంబర్ 12 : సేవ చేసేందుకే ప్రజలు ఉప ఎన్నికలో తనకు అవకాశం ఇచ్చి ఆశీర్వదించారని ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం 154 మందికి రూ.కోటి 60 లక్షలు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, 26 మందికి రూ.89,900 సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్యాంపు కార్యాలయంలో త్వరలో ప్రారంభించి వారంలో నాలుగు రోజులు ఇక్కడే ఉంటున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్, తాసీల్దార్ కృష్ణారెడ్డి ,ఎంపీడీఓ జాన య్య, చండూరు మార్కెట్ డైరెక్టర్ ఏరుకొండ శ్రీనివాసు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
పలు వార్డుల్లో పర్యటన
మండలకేంద్రంలోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే కూసుకుంట్ల పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలు డ్రైనేజీ, సీసీరోడ్లు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను యుద్ధ్ద ప్రాతిపదికతో పరిష్కారించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మండలకేంద్రంలో దళితబంధు పథకం కింద ఏర్పాటుచేసుకున్న మొబైల్ దుకా ణం ఎమ్మెల్యే ప్రారంభించారు. జడ్పీ పాఠశాలను సందర్శించి అక్కడ శిథిలావస్థలో ఉన్న భవనాలను పరిశీలించి వెంటనే వాటిని కూల్చివేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్, సర్పంచ్ మిర్యాల వెంకన్న, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి, వార్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం రైతువేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీఆర్టీయూ నాయ కులు ఎమ్మెల్యే కూసుకుంట్లను శాలువాతో సత్కరించారు కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సుంకరి భిక్షంగౌడ్, మండలశాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శలు ఎండీ యూసుఫ్పాషా, భాస్కర్గౌడ్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు డి. కళావతి, మల్లికార్జున్రెడ్డి పాల్గొన్నారు.
చండూరులో..
చండూరు : మండల కేంద్రంలోని భవానీ ఫంక్షన్ హాల్లో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 158 మంది లబ్ధిదారులకు కోటి 58 లక్షల కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను సొంత ఖర్చులతో మహిళలకు చీరెలు పంపిణీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, ఎంపీపీ పల్లె కల్యాణీరవికుమార్, తాసీల్దార్ గణేశ్, మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళావెంకన్న, వైస్ ఎంపీపీ మందడి నర్సిరెడ్డి, ఎంపీటీసీ కావలి మంగమ్మాప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గుర్రం మాధవీవెంకట్రెడ్డి,సర్పంచులు నందికొండ నర్సిరెడ్డి, చొప్పరి అనురాధావెంకన్న, పల్లె వెంకన్న, మంచికంటి రాణిబీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న, పట్టణాధ్యక్షుడు భూతరాజు దశరథ, కౌన్సిలర్లు కోడి వెంకన్న, అన్నెపర్తి శేఖర్, కీర్తీసంజయ్, చిలుకూరి రాధికాశ్రీనివాస్ ఉన్నారు.
పేద విద్యార్థికి చేయూత
గుండ్రపల్లి గ్రామానికి చెందిన పేద విద్యార్థి భూతరాజు శివలక్ష్మి బీఎస్సీ హార్టికల్చర్ ప్రవేశ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంకు సాధించారు. ఆర్థి కంగా ఇబ్బంది బాధపడుతుండడంతో ఎమ్మెల్యే కూసుకుంట్ల విద్యార్థికి రూ.50 వేల ఆర్థిక సాయం అందజేశారు. బీఆర్ఎస్ యువజన విభాగం మండలాధ్యక్షుడు ఉజ్జిని అనిల్రావు పాల్గొన్నారు.