భువనగిరి అర్బన్, మే 20 : పలు అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాలకు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి విచ్చేసిన రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావుకు శుక్రవారం పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. టీ ఆర్ఎస్ భువనగిరి పట్టణ, మండల కమిటీల ఆధ్వర్యంలో పట్టణంలోని డాల్ఫిన్ హోటల్ సమీపంలో మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డిని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జనగాం పాండు ఆధ్వర్యంలో స్వాగతం పలికి గజమాలతో సన్మానించారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో మంత్రి హరీశ్రావు, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, గాదరి కిశోర్కుమార్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
వారితోపాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడ కొలుపుల అమరేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లమాస రమేశ్గౌడ్, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, పీఏసీఎస్ చైర్మన్ నోముల పరమేశ్వర్రెడ్డి, ఎంపీపీ నిర్మలావెంటకస్వామి, జడ్పీటీసీ బీరు మల్లయ్య, రైతుబంధు మండల సమితి కన్వీనర్ కంచి మల్లయ్య, వైస్ ఎంపీపీ ఏనుగు సంజీవరెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు రాజిరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఏవీ కిరణ్కుమార్, ప్రధాన కార్యదర్శులు రచ్చ శ్రీనివాస్రెడ్డి, ఓంప్రకాశ్గౌడ్, కౌన్సిలర్లు శంకర్, స్వామి, భగత్, వేణుగోపాల్రెడ్డి, నర్సింగ్నాయక్, సర్పంచులు మల్లికార్జున్, ము రళి, సురేశ్, ప్రభాకర్, ఎంపీటీసీలు వెంకటేశ్, కొండల్రెడ్డి, మల్లేశం, తాజ్పూర్ టీఆర్ఎస్ గ్రా మశాఖ అధ్యక్షుడు శ్రీనివాస్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ కంకల కిష్టయ్య, ఎడ్ల రాజేందర్రెడ్డి, వెంకేటశ్వర్రావు, లక్ష్మీనారాయణగౌడ్, రాజేశ్, మహేశ్, శ్రీనివాస్, రాజశేఖర్, మధుసూదన్రెడ్డి, రమేశ్, పాండు, సూరజ్, నాగేంద్రబాబు, యేసు, శంకరయ్యయాదవ్, మహేశ్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ నాయకుడు చిక్క ప్రభాకర్గౌడ్ హరీశ్రావును ప్రత్యేకంగా కలిసి సన్మానించారు.