నల్లగొండ రూరల్, జనవరి 4: చివరి భూములకు సాగు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. మండలంలోని గుండ్లపల్లి వద్ద ఏఎమ్మార్పీ నుంచి డీ-37 కాల్వకు సాగునీటిని బుధవారం ఆయన విడుదల చేసి మాట్లాడారు. షెడ్యూల్ ప్రకారం నీటిని విడుదల చేయడానికి ఇంకా రెండు రోజుల సమయం ఉన్నా రైతుల అవసరాల మేరకు నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. వందలాది గ్రామ పంచాయతీలు, చెరువులకు ఈ నీటిని ఉపయోగించనున్నామన్నారు. మరో నాలుగైదు రోజుల్లో నీటి రాక మరింత పెరుగనుందన్నారు. రైతులు నీటిని దుర్వినియోగం చేయవద్దని సూచించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా 24 గంటల కరెంట్తో పాటు రైతులకు పెట్టుబడి సాయం, రైతు వంటి పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఈఈ ఆనందర్రావు, డీఈ మనోహర్రెడ్డి, జేఈఈ సుభాశ్, జడ్పీటీసీ లక్ష్మయ్య, సర్పంచ్ పంతంగి సరితాశ్రీనాథ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దేప వెంకట్రెడ్డి, నాయకులు బకరం వెంకన్న, వెంకటగిరి, సహాదేవ్, పనస శ్రీను, జంగ య్య, బైరెడ్డి వెంకట్రెడ్డి, జాన్రెడ్డి, రాజుపేట మల్లేశ్ ,సైదులు, బోధనం వెంకట్రెడ్డి, కృష్ణ, విఘ్నేశ్, విమలమ్మ, బద్రీ పాల్గొన్నారు.