– సర్పంచ్ చాట్ల రమాదేవి రాములు
దేవరకొండ రూరల్, డిసెంబర్ 26 : తెలుగుపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దనున్నట్లు ఆ గ్రామ సర్పంచ్ చాట్ల రమాదేవి రాములు తెలిపారు. శుక్రవారం దేవరకొండ మండలం తెలుగుపల్లి గ్రామంలో రహదారికి ఇరువైపులా ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు, కంప చెట్ల తొలగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.