– మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి
నల్లగొండ, ఆగస్టు 21 : శ్రీశైలం నుండి ఆంధ్రప్రదేశ్ నిత్యం నీటి దోపిడీ చేస్తున్నా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రులు ఉత్తమ్కుమారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేతకాని దద్దమ్మలుగా చూస్తూ ఇక్కడి వ్యవసాయాన్ని ఆగం చేస్తున్నరని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి దుయ్యబట్టారు. మాజీ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి శుక్రవారం ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ జడ్పి చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు, కంచర్ల భూపాల్ రెడ్డి, నేతలు కంచర్ల కృష్ణారెడ్డి, ఒంటెద్దు నర్సింహా రెడ్డితో కలిసి నల్లగొండలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాగార్జున సాగర్ నీళ్లను అంధ్రప్రదేశ్ యథేచ్ఛగా దోచుకుని పోతున్నా కూడా నోరు ముసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం నుండి నిత్యం నీటి దోపిడీ చేసుకుని పోతుంది. జిల్లాలో ఈ ఇద్దరు మంత్రుల వల్ల వ్యవసాయం ఆగం అయింది. తాను సాక్ష్యలతో సహా ఆంధ్రా నీటి దోపిడీని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నను, ప్రభుత్వంలో చలనం లేదు. శ్రీశైలంలో పోతిరెడ్డిపాడు ద్వారా పొక్క పెట్టి నది మొత్తంను మళ్లించుకుంటున్నారు. కేసీఆర్ ఉన్నన్ని రోజులు ఆంధ్రా వాళ్ల ఆటలు సాగనివ్వలేదు. సాగర్ ఓవర్ ఫ్లో అయి సముద్రంలో నీళ్లు వదిలినప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తీసుకుపోవాలనే నిబంధన ఉంది.
పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని దోచుకుని రాయలసీమలోని అన్ని ప్రాజెక్టులను ఫుల్ గా నింపుకున్నారు. ఆంధ్రా ప్రభుత్వం. నాగార్జున సాగర్లో ఇప్పుడు ఉన్నటువంటి నీటి కంటే తక్కువ ఉన్నప్పుడు కూడా సాగు నీరు ఇచ్చిన ఘనత మా కేసీఆర్ గారిది. 17 సార్లు వరుసగా నీళ్లు అందించాం. అది మా ఘనత. చెప్పి మరి నీళ్లు ఇచ్చి చూపినం. ఎడమ కాల్వ కింద ఉన్న లిఫ్ట్ లకు కూడా పుష్కలంగా నీళ్లు ఇచ్చినం. ఇవ్వాళ సాగర్ లో 532 అడుగుల నీటి మట్టం ఉంది. ఇప్పుడు ఎడమ కాల్వకు నీళ్లు చక్కగా ఇవ్వొచ్చు. జిల్లా మంత్రులు నిద్ర మత్తులో జోగుతున్నారు. కేవలం పదవుల భయంతో ఆంధ్రాకు లొంగిపోయి బ్రతుకుతున్నారు. రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు. ఎడమ కాల్వకు ఎందుకు నీళ్లు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలి. ఇప్పుడు 30 TMC ల నీరు సాగర్ అందుబాటులో ఉన్నయ్. వాటితో సాగు నీరు ఇవ్బొచ్చు. సాగర్ లో ఓ యాగం చేసి చేతులు దులుపుకొన్నారు. రైతులు పంటలు పండనివ్వొద్దు అని కుట్ర చేస్తున్నారు. పంటలు పండితే బోనస్, యూరియా ఇవ్వాలని కావాలనే ఈ ప్రభుత్వం దొంగచాటుగా నిర్ణయం తీసుకుంది.
మంత్రి కోమటిరెడ్డి పిచ్చోడిలా నీళ్లు ఇవ్వం అని చెప్తున్నాడు. కోమటిరెడ్డిని,ఉత్తమ్ ని ఈ ఎమ్మెల్యేలను గెలిపించి సాగర్ ఆయకట్టు రైతులు తప్పు చేశారు. ఇప్పటికైనా సాగర్ ఆయకట్టు రైతులు చైతన్యం కావాలి. సాగర్ నీళ్లు మా హక్కు. నీళ్లు ఎందుకు ఇవ్వరో చెప్పాలి. ఆంధ్రాలో అక్కడ చక్కగా పంటలు సాగవుతున్నాయ్. మరి మనకు నీళ్లు వద్దా? మనం అసలు హక్కుదారులం. మనకు ఇవ్వాళ తీవ్ర అన్యాయం జరుగుతుంది. వెంటనే ఎడమ కాల్వకు, లిఫ్ట్ లకు కూడా నీటిని విడుదల చేయాలి. అదే మా డిమాండ్. తెలంగాణ రాకముందు ఎలా ఉండెనో మళ్లీ అదే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం నడిపే తెలివి వీళ్లకు లేదు. రైతాంగం కూడా తిరుగుబాటు చేయాలి. కాంగ్రెస్ మంత్రులను ఎమ్మెల్యేలను గ్రామాల్లో నిలదీయాలి. ప్రశ్నించి సాదించుకోవాలి. మా కేసీఆర్ సాగర్ డెడ్ స్టోరేజ్ లో ఉన్నప్పుడు కూడా సాగు నీళ్లు ఇచ్చారు. ఇవ్వాళ నీళ్లు వున్నా ఎందుకు ఇవ్వరు. శ్రీశైలం కు కూడా వరద వస్తూనే ఉంది. శ్రీశైలం కు వచ్చిన నీళ్లు ఎక్కడికి పోతున్నాయో అందరికి తెలుసు. ఆ నీళ్లు పోతిరెడ్డిపాడుకు తరలిస్తున్నారు.
కాంగ్రెస్ అంటేనే దగా.. నీళ్లు ఆంధ్రాకు తరలిస్తూ మనకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. ఇప్పటివరకు 148 TMC ల నీరు పోతిరెడ్డిపాడు ద్వారా దోచుకుని పోయారు. ఎల్ నినో తెచ్చిన కరువు కాదు ఇది. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు ఇది. నీళ్లు ఇవ్వకుండా మభ్యపెడుతున్నారు. జిల్లా మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి చేతకాని దద్దమ్మలెక్క కళ్లు అప్పగించి చూస్తున్నారు. వీళ్ల నిర్లక్ష్యం వల్లే దారుణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లు ఉన్నా కూడా విడుదల చేయడం లేదు. యాగాల పేరుతో కాలయాపన చేస్తున్నారు, మభ్యపెడుతున్నారు. పోతిరెడ్డిపాడుకు ఎలా పోతాయి ? నీళ్లు మా హక్కు.. నీళ్లు ఇచ్చి తీరాలి… లేకుంటే ఉద్యమం తప్పదని, కేసీఆర్ తో చర్చించి బీఆర్ఎస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని జగదీశ్రెడ్డి హెచ్చరించారు. ఓ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు, ఎలాగైనా నీటిని సాధిస్తామని, రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని పేర్కొన్నారు.