మోర్తాడ్, సెప్టెంబర్ 20: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతున్నది. ప్రాజెక్ట్లోకి శనివారం 1.90లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు(80.5టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1090.9 అడుగుల (80.053టీఎంసీల) నీరు నిల్వ ఉన్నది. ప్రాజెక్ట్ నుంచి 2,13,465 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతున్నది.
ప్రాజెక్ట్ 39గేట్లు ఎత్తి 1,97,010 క్యూసెక్కులు, వరద కాలువకు 6,735, కాకతీయ కాలువకు నాలుగు వేలు, ఎస్కేప్ గేట్ల ద్వారా నాలుగు వేలు, సరస్వతీ కాలువకు 400, లక్ష్మీ కాలువకు 200, అలీసాగర్ ఎత్తిపోతలకు180, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తుండగా, 709 క్యూసెక్కుల నీరు ఆవిరిరూపంలో వెళ్తున్నది.
నిజాంసాగర్, సెప్టెంబర్20: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద కొనసాగుతూ ఉన్నది. ప్రాజెక్టులోకి శనివారం సాయంత్రం 57,048 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నదని ప్రాజెక్టు ఏఈలు అక్షయ్, సాకేత్ తెలిపారు. దీంతో ప్రాజెక్టు ఎనిమిది వరద గేట్లను ఎత్తి 54,772 క్యూసెక్కులు, ప్రధాన కాలువ ద్వారా వెయ్యి క్యూసెక్కుల చొప్పున మొత్తం 55,772 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405.00 అడుగులు (17.80 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1403.76 అడుగుల (16.02 టీఎంసీల) నీరు నిల్వ ఉన్నదని తెలిపారు.