– బీఆర్ఎస్ కోదాడ పట్టణాధ్యక్షుడు ఎస్కే నయీమ్
కోదాడ, ఏప్రిల్ 01 : కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ వార్డు ఇన్చార్జీలు, కౌన్సిలర్లు ఓటరు సవరణ సర్వేలో పాల్గొనాలని ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎస్.కె నయీమ్ అన్నారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణ వ్యాప్తంగా ఆయా వార్డులలో బూత్ లెవల్ అధికారులు మృతి చెందిన, ఇక్కడ నివసించని ఓటర్లను తొలగించేందుకు నిర్వహిస్తున్న సర్వేకు సహకరించాలని.. ఇదే అంశంపై తమ పార్టీ ఆర్డీఓకు వినతి పత్రం అందజేసిందని అందుకు స్పందించిన ఆయన బీఎల్ఓ లతో సర్వే నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ చీమ నరేష్, నాయకులు ఉపేందర్, సాదిక్, వెంకట్, మల్లయ్య గౌడ్, వీర్రాజు, మజాహర్, దస్తగిరి, ఆసిఫ్, సాదిక్ పాల్గొన్నారు.