నీలగిరి, ఫిబ్రవరి 02 : ఈ నెల 11న జరిగే నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో 5వ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న తనను గెలిపించేందుకు కారు గుర్తుపై ఓటేయాలని ఆ పార్టీ అభ్యర్థి వున్న రాజేశ్వరి వెంకన్న ఓటర్లను కోరారు. సోమవారం డివిజన్ పరిధిలోని మిధుల కాలనీ, మహిళా ప్రాంగణం, పలు కాలనీల్లో కార్యకర్తలతో కలిసి ఇంటింట ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ హయాంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సహకారంతో నల్లగొండ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ప్రధానంగా సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు ఓపెన్ డ్రైన్లను నిర్మించి లో వోల్టేజీ సమస్యను సైతం తీర్చామన్నారు. అర్హులందరికి పింఛన్లు అందజేయడం, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపచేయడం లాంటి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అవుటర్ రవీందర్ కాలనీ నాయకులు నల్లగొండ అశోక్, జీవన్, కృష్ణ, వెంకన్న పాల్గొన్నారు.