సూర్యాపేట రూరల్, ఏప్రిల్ 24 : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే రెండో అతిపెద్ద ప్రాజెక్టు మూసీని రాష్ట్ర ప్రాజెక్టుల ఎక్స్పర్ట్ కమిటీ సభ్యులు, రిటైర్డ్ సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ అశోక్కుమార్ గంజు, రిటైర్డ్ ఇంజినీర్ చీఫ్ రామరాజు పరిశీలించారు. డ్యామ్ ఎడమ వైపున లీకేజీలు అవుతున్నాయని అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వడంతో సోమవారం వారు డ్యామ్ను పరిశీలించారు.
ఈ సందర్భంగా లీకేజీల వద్ద గ్రౌంటింగ్, షాట్ క్రిటింగ్ చేయాలని, అలాగే కొత్త టెక్నికల్ పద్ధ్దతులు వాడాలని అధికారులకు సూచి ంచారు. కార్యక్రమంలో ఎస్ఈ నాగేశ్వర్రావు, ఈఈ భద్రూనాయక్, డీఈ చంద్రశేఖర్, సీఈ రమేశ్, ఏఈ లు ఉదయ్కుమార్, స్వప్న, మమత పాల్గొన్నారు.