నల్లగొండ : పాడి పంటలతోనే గ్రామాలు సస్యశ్యామలంగా ఉంటాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం చిట్యాల మండలం ఎలికట్టె గ్రామంలో పశుగణాభివృద్ది సంస్థ నల్లగొండ జిల్లా వారి ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం, పాడి రైతుల అవగాహన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో పశుసంపద పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో పాల ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయన్నారు. అనంతరం లబ్ధిదారులకు నూతన పెన్షన్ కార్డులు, కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.