పెన్పహాడ్, ఫిబ్రవరి 22 : రైతు వేదిక పెన్పహాడ్కు ప్రభుత్వం నుంచి వచ్చిన వీడియో కాన్ఫరెన్స్ యూనిట్స్ను జిల్లా వ్యవసాయ అధికారి జి.శ్రీధర్రెడ్డి గురువారం తనిఖీ చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ యూనిట్స్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో ఒక క్లస్టర్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
అందులో భాగంగా కోదాడ కాపుగల్లు, సూర్యాపేటకు పెన్పహాడ్, తుంగతుర్తికి వర్ధమానుకోట, హుజూర్నగర్కు పాలకవీడు, గుడుగుంట్లపాలెం క్లస్టర్కు ఈ వీడియో కాన్ఫరెన్స్ యూనిట్స్ మంజూరు అయినట్లు, ఈ నెల 24న ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇకపై రైతులకు నేరుగా ప్రభుత్వం, వ్యవసాయ శాస్త్రవేత్తల నుంచి సలహాలు, సూచనలు అందనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఏఓ బి.కృష్ణ సందీప్, ఏఈఓలు సంధ్య, మనోజ్, గోపి పాల్గొన్నారు.