కనగల్, జనవరి 20 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు నిరుపేద కుటుంబాలకు వరమ కలెక్టర్ వినయ్క్రిష్ణారెడ్డి అన్నారు. మండలంలోని పర్వతగిరి గ్రామంలో రెండో విడుత కంటివెలుగు శిబిరాన్ని శనివాం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శిబిరాలు నిర్వహించే గ్రామాల్లో ప్రజలకు ముందస్తుగా సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సోమసుందర్రెడ్డి, డాక్టర్ వరూధిని, సర్పంచ్ చెనగాని అంజమ్మారామచంద్రు, పంచాయతీ కార్యదర్శి చీదేటి సంతోష్రెడ్డి, సిబ్బంది మేకల జానయ్య పాల్గొన్నారు.
మునుగోడు : మునుగోడు, గంగోరిగూడెం గ్రామపంచాయతీల ఆవరణలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరం రెండో రోజూ కొనసాగింది. మండల కేంద్రంలో 420మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 90 మందికి కంటి అద్దాలు అందించామని 14 మందికి శస్త్ర చికిత్స కోసం సిఫార్సు చేసినట్లు తెలిపారు. శిబిరాలను శుక్రవారం డిప్యూ టీ డీఎంహెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్రెడ్డి సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
శాలిగౌరారం: మండలంలోని జాలోనిగూడెంలో 150 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 5 గురిని శస్త్ర చికిత్స కోసం సిఫార్సు చేశారు. కంటి వెలుగు ప్రోగ్రాం అధికారి వెంకటేశం, రామకృష్ణ, సూపర్వైజర్ విజయలక్ష్మి, భాస్కర్, పద్మావతి, నవనీత, ధనలక్ష్మి పాల్గొన్నారు.
నకిరేకల్: మండలంలోని ఓగోడు, చందంపల్లి గ్రామాల్లో నిర్వహించిన శిబిరాల్లో గురువారం, శుక్రవారం మొత్తం 530 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 139 మందికి కంటి అద్దాలు అందజేశారు. 116 మందిని కంటి శస్త్ర చికిత్స నిమిత్తం జిల్లా దవాఖానకు సిఫార్సు చేశారు. పరీక్షలు చేసిన 74 మందికి ఇంకా కంటి అద్దాలు ఇవ్వాల్సి ఉందని వైద్యాధికారి డాక్టర్ యోగస్వీ తెలిపారు. ఓగోడు కంటి వైద్యశిబిరాన్ని జిల్లా మలేరియా అధికారి దుర్గయ్య సందర్శించారు. కార్యక్రమాలలో పీహెచ్ఎన్ సుకన్య, హెచ్ఈఓలు నర్సింహాచారి, రాపోలు రవి, హెచ్ఎస్ శ్యాంసుందర్ పాల్గొన్నారు.
కట్టంగూర్ : మండలంలోని చెర్వుఅన్నారం, కట్టంగూర్ గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమం రెండో రోజు కొనసాగింది. కట్టంగూర్లో 150 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 24 మందికి అద్దాలు, చెర్వుఅన్నారంలో 117 మందికి పరీక్షలు చేసి 22 మందికి అద్దాలను పంపిణీ చేసినట్లు వైద్యాధికారి శ్వేత తెలిపారు.