చిట్యాల, డిసెంబర్ 3: సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శనివారం మండలంలోని ఏపూరు గ్రామంలో రూ. 20 లక్షలతో సీసీ రోడ్లు, రూ. 10 లక్షలతో అంగన్వాడీ భవనం, గుండ్రాంపల్లిలో రూ.20లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర మంత్రులకు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు. బీజేపీ నాయకులు చెప్పే మాయమాటలు, సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాజకీయాలకతీతంగా గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి సమన్యాయం జరుగుతందన్నారు. అనంతరం దళిత బంధు పథకాన్ని ప్రతి టుంబా నికి ఇవ్వాలని సీపీఎం నాయకులు కత్తుల లింగస్వామి, ఎండీ జహంగీర్, యాదయ్య ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా వడ్డెరల సమస్యలను పరిష్కరించాలని ఆ సంఘం మండ లాధ్యక్షుడు కృష్ణ వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ సునీతావెంకటేశ్, జడ్పీటీసీ ధనమ్మాయాదగిరి, మార్కెట్ చైర్మన్ ఆదిమల్లయ్య, సర్పంచ్లు మాధవి, పుష్పనర్సింహ, బొందయ్య, ఎంపీటీసీలు పద్మ, సత్తిరెడ్డి పాల్గొన్నారు.
మండలంలోని ఏపూరు గ్రామంలో దివీస్ లేబోరేటరీస్ అందించిన రూ. 5.20లక్షలతో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ప్లాంట్ను శనివారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రారంభించారు. దివీస్ కంపెనీ యాజమాన్యాన్ని అభినందించారు. సర్పంచ్ మాధవీమల్లేశ్, దివీస్ సీఎస్ఆర్ ఇన్చార్జి వెంకటరాజు, సాయికృష్ణ, వార్డు సభ్యులున్నారు.