రామన్నపేట, మే11: కేంద్ర మంత్రి బండి సంజయ్ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసి, ఆయన కుమారుడు భగీరథ్ను అరెస్టు చేయాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రామన్నపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చిట్యాల భువనగిరి రహదారిపై నిరసన వ్యక్తం చేస్తూ బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా లింగయ్య మాట్లాడుతూ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై ఫోక్సో కేసు నమోదై రోజులు గడుస్తున్నా నేటికీ ప్రభుత్వం అరెస్టు చేయకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు.
బండి సంజయ్కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అండగా నిలు స్తూ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు బందెల రాములు, కం భంపాటి శ్రీనివాస్, బొక్క మాధవరెడ్డి, వేమవరపు సుధీర్బాబు, కన్నెబోయిన బలరాం, పులిపలపుల వీరస్వామి, అంబటి రవీందర్రెడ్డి, బద్దుల రమేశ్, బత్తుల వెంకటేశం, ఎస్కే చాంద్, పున్న వెంకటేశం, మిర్యాల మల్లేశం, జాడ సంతోశ్, ఆమేర్, ముసాబ్, బాసాని రాజు, కూనూరు మత్త య్య, మామిండ్ల అశోక్, రేఖ యాదయ్య, గంగుల రాఘవరెడ్డి, బైకాని మహేశ్, బొడ్డుపల్లి రాజు, నక్క నరేందర్, ఆవుల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.