శాలిగౌరారం, నవంబర్ 3: పదేండ్ల ప్రస్థానంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధ్దిని ఆదరించి పట్టం కట్టాలని, తన బలం..బలగం నియోజకవర్గ ప్రజలేనని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండలంలోని రామగిరి, శాలిలింగోటం, అంబారిపేట, తుడిమిడి, చిత్తలూర్, వంగమర్తి గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం చేశారు. ఉదయం 9 నుంచి రాత్రి వరకు నిర్విరామంగా తన ప్రచారం చేశారు. ఆయా గ్రామాల్లోని ప్రజలతో మమేకమై ప్రధాన కూడళ్ల వద్దకు చేరుకోని భారీ జనసందోహాల నడుమ ఎమ్మెల్యే కిశోర్కుమార్ తన ప్రసంగాలను ప్రారంభించారు.
ప్రజలంతా ఎమ్మెల్యే కిశోర్కుమార్ చెప్పే ప్రసంగానికి చప్పట్లు కొడుతూ జైజైలు పలికారు. పదేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని ఒక్కొక్కటిగా వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోనే కాకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేసేది ఒక్క కేసీఆర్ ప్రభుత్వమేనని అన్నారు. అన్ని గ్రామాల్లో ఎమ్మెల్యే కిశోర్ కుమార్కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా పూలవర్షం కురిపించారు. మహిళలు మంగళహారతులతో కుంకమ దిద్దారు. కోలాటం, చిడుత భజనలతో అపూర్వ స్వాగతం పలికారు.
ఈ 27 రోజులు తన కోసం పని చేస్తే..ఐదేండ్లు మీకు సేవకుడిగా పని చేస్తానని ఎమ్మెల్యే కిశోర్కుమార్ హామీ ఇచ్చారు. ప్రజలు, నాయకులు, కార్యకర్తలే నాకు బలగం అన్నారు. రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డు కలిగిన వారందరికీ కేసీఆర్ బీమా కల్పించనున్నారని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అయితగోని వెంకన్నగౌడ్, ఎంపీపీ గంట లక్ష్మమ్మ, జడ్పీటీసీ ఎర్ర రణీలాయాదగిరి, వైస్ ఎంపీపీ కందుల అనిత, చాడ హతీశ్రెడ్డి, గుండా శ్రీనివాస్, తాళ్లూరి మురళి, మామిడి సర్వయ్య, చామల వెంకటరమణారెడ్డి, చాడ లోకేందర్రెడ్డి, నూక సత్తయ్యయాదవ్, కిరణ్కుమార్యాదవ్, కంబాలపల్లి కృష్ణ, సర్పంచులు బండారు శంకరయ్య, పాక మౌనికాయాదయ్య, బీరం శోభానర్సిరెడ్డి, చెలకాని రజితా కొమురయ్య, మామిడికాయల జయమ్మ, ఎంపీటీసీలు పాక రాములు, దాసరి ప్రమీల, నాయకులు సుల్తాన్ ఎల్లయ్య, దాసరి వెంకన్న, ఆకుల శ్రీను, నిమ్మల సాయిబాబా, నిమ్మల
శాలిగౌరారం : మండలంలోని ఊట్కూర్ గ్రామానికి చెందిన 15 కాంగ్రెస్ కుటుంబాలు ఎమ్మెల్యే కిశోర్కుమార్ సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. వారికి ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలోబీఆర్ఎస్ ఊట్కూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు రావుల రామచం ద్రు, మాజీ సర్పంచ్ వేముల శైలజా అశోక్, భూపతి యాదయ్య, మహేశ్వరం వెం కన్న, కప్పల శ్రీధర్ ఉన్నారు.