నల్గొండ : తెలంగాణ బడ్జెట్లో విద్యారంగానికి ప్రభుత్వం పెద్ద పీట వేసినందుకు.. సీఎం కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్వీ నేతలు క్షీరాభిషేకం చేశారు. అనంతరం జై కేసీఆర్ అంటూ టీఆర్ఎస్వీ నేతలు నినాదాలు చేశారు.
ఈసందర్భంగా టీఆర్ఎస్వీ స్టేట్ జనరల్ సెక్రటరీ బీ నాగార్జున మాట్లాడుతూ.. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన జరుగుతోందన్నారు. వార్షిక పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకే ఎక్కువ ర్యాంకులు వచ్చాయని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు పెంచేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు, మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాని కోసం ఈ బడ్జెట్లో రూ.7289 కోట్లను కేటాయించింది. అలాగే.. మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, ములుగు, వరంగల్, నారాయణ్పేట, గద్వాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటు కోసం రూ.1000 కోట్లను కేటాయించింది. అలాగే.. మహిళల కోసం ప్రత్యేకంగా యూనివర్సిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.