మంత్రి కేటీఆర్ సభకు భారీగా తరలివచ్చిన కార్యకర్తలు
హాలియా, మే14 : నందికొండ, హలియా మున్సిపాలిటీలకు సంబంధించి రూ. 56 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేసేందుకు పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ శనివారం హాలియాకు వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు టీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. మంత్రి కేటీఆర్తో పాటు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ప్రసంగం నాగార్జునసాగర్ నియోజకవర్గ కార్యకర్తల్లో జోష్ నింపింది. 30 ఏండ్ల కాంగ్రెస్ పాలనను ఎండగడుతూనే ఏడేండ్లలో సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకు పోతున్న తీరును మంత్రి కేటీఆర్ వివరించారు. కాంగ్రెస్ పాలకులు చేయలేక పోయిన అనేక పనులను ఎమ్మెల్యే నోముల భగత్ ఏడాది కాలంలోనే పూర్తి చేశారని చెప్పారు. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.820 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు.
ఎమ్మెల్యే నోముల భగత్ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు రాంచందర్నాయక్, జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడవల్లి విజయేందర్రెడ్డి, నాయకులు కడారి అంజయ్య యాదవ్, కట్టెబోయిన గురువయ్య యాదవ్, మన్నెం రంజిత్ యాదవ్, ఆవులదొడ్డి రాహుల్, బాబూరావునాయక్, ఎంపీపీలు పేర్ల సుమతి, చెన్ను అనూరాధ, వెంకటేశ్వర్లు, బొల్లం జయమ్మ, భగవాన్నాయక్, జడ్పీటీసీలు గాలి సరిత, సూర్యభాష్యానాయక్, అబ్బిడి కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్లు వెంపటి పార్వతమ్మ, కర్ణ అనూషారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు కూరాకుల వెంకటేశ్వర్లు, పిడిగం నాగయ్య, రవినాయక్, సత్యపాల్, నరేందర్, చెన్నారెడ్డి, చెరుపల్లి ముత్యాలు, టీఆర్ఎస్ నాయకులు మల్గిరెడ్డి లింగారెడ్డి, పాశం గోపాల్రెడ్డి, గుంటుక వెంకట్రెడ్డి, గజ్జెల లింగారెడ్డి, రావుల చినభిక్షం, రావుల రాంబాబు, హనుమంతరావు, కేవీ రామారావు, శ్రీనివాస్రెడ్డి, యడవల్లి దిలిప్రెడ్డి, రాంచంద్రయ్య, మర్ల చంద్రారెడ్డి, అంజత్ఖాన్, హలీం, పాల్గొన్నారు.
భారీ బందోబస్తు
హాలియా, నందికొండకు మంత్రి రాక సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్సీ రెమా రాజేశ్వరి బందోబస్తును పర్యవేక్షించగా ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలు, 24 మంది సీఐలు, 58 మంది ఎస్ఐలు, 400 మంది కానిస్టేబుళ్లు, 30 మంది మహిళా కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. బహిరంగ సభకు వచ్చేవారికి వాహనాలకు పోలీసులు ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. దాంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తలేదు.