మోదీ, అమిత్షా ఎన్ని కుయుక్తులు పన్నినా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వచ్చి ఇక్కడ అడ్డా వేసినా మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపును నిలువరించలేరని, బీజేపీకి దక్కేది మూడో స్థానమేనని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తేల్చిచెప్పారు. శుక్రవారం మర్రిగూడ మండలం సరంపేట గ్రామానికి పలువురు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్పై నానాటికి పెరుగుతున్న విశ్వసనీయతకు టీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్న వలసల ప్రవాహమే నిదర్శనమన్నారు.
మర్రిగూడ, అక్టోబర్ 7 : మోదీ, అమిత్షాలు ఎన్ని కుయుక్తులు పన్నినా మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) గెలుపును ఆపలేరని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వచ్చి ఇక్కడ అడ్డా వేసినా బీజేపీది మూడో స్థానమేనని పేర్కొన్నారు.
మండలంలోని సరంపేట గ్రామానికి చెందిన బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు యశ్వంత్కుమార్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి రావుల మధు, సోషల్ మీడియా ఇన్చార్జి రావుల రమేశ్, సీనియర్ నాయకుడు జగన్తో పాటు ఆ పార్టీకి చెందిన నాయకులు రావుల మధు, నరేశ్, బుర్ర సైదులు, బచ్చనగోని సైదులు, రావుల సతీశ్, ఎన్ఎస్యూఐ జిల్లా నాయకులు చాపల పెద్ద సైదులు, చాపల చిన్న సైదులు, యాదయ్య, రావుల రాజు, తాటికొండ సతీశ్, చాపల సైదులు, యాదయ్య సహా పలువురు బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు శుక్రవారం రాత్రి మంత్రి జగదీశ్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్(బీఆర్ఎస్)లోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రె స్ పార్టీ మునిగిపోయే పడవగా అభివర్ణించారు. సీఎం కేసీఆర్పై నానాటికి పెరుగుతున్న విశ్వసనీయతకు టీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్న వలసలే నిదర్శనమన్నారు. కార్యక్రమంలో సరంపేట సర్పం చ్ వెనమల్ల వెంకటమ్మామధుకర్, కొట్టాల మాజీ సర్పంచ్ కృష్ణ, టీఆర్ఎస్ నేత నర్సింహ పాల్గొన్నారు.