ప్రధాని వ్యాఖ్యలపై అట్టుడికిన జిల్లా
నల్లజెండాలతో టీఆర్ఎస్ ర్యాలీలు
మోదీ దిష్టిబొమ్మల దహనం ఎమ్మెల్యేల నేతృత్వంలో ఆందోళనలు
విధులు బహిష్కరించిన న్యాయవాదులు
నల్లబ్యాడ్జీలతో పని చేసిన నాయీబ్రాహ్మణులు
ఆందోళన బాటలో సీపీఐ, కాంగ్రెస్,
ప్రజా సంఘాలు సైతం..
నల్లగొండ, ఫిబ్రవరి 9: ప్రధాని మోదీ తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు నల్లగొండ, నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ఆయా మండలకేంద్రాల్లో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. నల్లగొండ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, చిట్యాలలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణపై ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని దేశంలో బీజేపీని నామ రూపాల్లేకుండా చేస్తామని హెచ్చరించారు. ప్రధాని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చట్టాలతో రైతులను నట్టేట మంచుదామని ప్రయత్నం చేసిన మోదీ చివరికి రైతుల ఉద్యమాలతో తోక ముడిచినట్లు తెలిపారు. నల్లగొండలో లక్ష్మి గార్డెన్ నుంచి హైదరాబాద్ రోడ్డు ద్వారా ఎన్టీఆర్ విగ్రహం, శివాజీనగర్, బోయవాడ, బస్టాండ్, ప్రకాశం బజార్ మీదుగా క్లాక్టవర్ సెంటర్ వరకు టీఆర్ఎస్ కార్యకర్తలు సుమారు రెండు వేల బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం క్లాక్ టవర్ సెంటర్లో మోదీ దిష్టి బొమ్మకు బీజేపీ జెండా కట్టి దహనం చేశారు. అలాగే న్యాయవాదులు నల్లజెండాలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలీ, పట్టణ కార్యదర్శి పిల్లి రామరాజు, ప్రధాన కార్యదర్శి బోనగిరి దేవేందర్, అభిమన్యు శ్రీనివాస్, మారగోని గణేశ్, ఇబ్రహీం, ఆలకుంట్ల మోహన్ బాబు, మాలె శరణ్యారెడ్డి, సింగం లక్ష్మి, కరీం పాషా, జమాల్ ఖాద్రి, దేప వెంకట్రెడ్డి, మామిడి పద్మ, రావుల శ్రీనివాస్రెడ్డి, వట్టికోటి శ్రీనివాస్, యామ దయాకర్, మైనం శ్రీనివాస్, జెర్రిపోతుల భాస్కర్, అయితగోని యాదయ్య, పల్రెడ్డి రవీందర్ రెడ్డి, శ్రీనివాస్, కటికం సత్తయ్య గౌడ్, పాశం సంపత్రెడ్డి, వనపర్తి జ్యోతి, దుబ్బ రూప, సంకుధనలక్ష్మి, స్వరూప పాల్గొన్నారు. టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఎంజీయూ ప్రధాన ద్వారం వద్ద సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు.
తిప్పర్తి, కనగల్ల్లో..
తిప్పర్తి, కనగల్ మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మోదీ దిష్టి బొమ్మను దహనం చేశారు. కార్యక్రమాల్లో డీసీసీబీ డెరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, సిరసవాడ సైదులు, లొడంగి గోవర్ధన్, రొట్టెల రమేశ్, వనపర్తి నాగేశ్వర్రావు, మోష, కొండ్ర స్వరూప, వనపర్తి జ్యోతి, కందుల లక్ష్మయ్య, కనగల్లో అయితగోని యాదయ్య, వంగాల సహదేవరెడ్డి పాల్గొన్నారు.
మునుగోడులో..
మునుగోడు : టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మునుగోడు, మర్రిగూడ, చండూరు మండల కేంద్రాల్లో ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మునుగోడులో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండా పురుషోత్తంరెడ్డి, రాష్ట్ర నాయకుడు నారబోయిన రవి, నాయకులు ఐతగోని లాల్బహదూర్గౌడ్, ఎండీ.రఫీక్, రావిరాల కుమారస్వామి, ఆకుల వెంకన్న, మాదగోని దేవలోకం, వల్లూరి లింగయ్య, దోటి సైదులు, శంకర్రెడ్డి, వంటెపాక వెంకన్న, మర్రిగూడలో జడ్పీటీసీ పాశం సురేందర్రెడ్డి, మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దంటు జగదీశ్వర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోటకూరి శంకర్యాదవ్, బాలం నర్సింహ, పందుల యాదయ్య, నల్ల యాదయ్య, బచ్చు రామకృష్ణ, ఐతగోని వెంకటయ్యగౌడ్, లపంగి నర్సింహ, మారగోని వెంకటయ్య, పందుల పాండు, రాములు గౌడ్, బాలం జంగయ్య, జయప్రసాద్, గోపినాయక్ చండూరులో మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళావెంకన్న, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ముడిగె ఎర్రయ్య యాదవ్, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు బొమ్మరబోయిన వెంకన్న, భూతరాజు దశరథ, టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకట్రెడ్డి, మొగుదాల వెంకన్న కౌన్సిలర్లు, కొన్రెడ్డి యాదయ్య, అబ్బనబోయిన లింగయ్య యాదవ్, మొండు ద్రౌపతమ్మావెంకట్ రెడ్డి, గుండమల్ల శ్రీనివాస్, నాయకులు భీమనపల్లి శేఖర్, తేలుకుంట్ల చంద్రశేఖర్, కురుపాటి సుదర్శన్, ధర్మేంద్ర, తాందారి రవిగౌడ్ పాల్గొన్నారు.
నకిరేకల్లో..
కట్టంగూర్ : నకిరేకల్, నార్కట్పల్లి, కట్టంగూర్, శాలిగౌరారం మండలాల్లో టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టి ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. చిట్యాలలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. కార్యమ్రాల్లో మున్సిపల్ చైర్మన్లు రాచకొండ శ్రీనివాస్, కోమటిరెడ్డి చిన వెంకట్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు నడికుడి ఉమరాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, ఎంపీపీలు కొలను సునీతావెంకటేశం, సూదిరెడ్డి నరేందర్రెడ్డి, జడ్పీటీసీలు తరాల బలరాములు, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు ఊట్కూరి ఏడుకొండలు, ప్రగడపు నవీన్రావు, బైరెడ్డి కరుణాకర్రెడ్డి, ఆవుల అయిలయ్య, పీఏసీఎస్ చైర్మన్లు నూక సైదులు, పాల్గొన్నారు. శాలిగౌరారంలో ఎంపీపీ గంట లక్ష్మమ్మ, జడ్పీటీసీ ఎర్ర రణీలాయాదగిరి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐతగోని వెంకన్నగౌడ్, వైస్ ఎంపీపీ కందుల అనిత, కట్టా వెంకట్రెడ్డి, గుండా శ్రీనివాస్, గంట శంకర్, శేఖర్బాబు, భిక్షపతి పాల్గొన్నారు.