శాలిగౌరారం, ఆగస్టు 17 : టీఆర్ఎస్ ప్రజల పార్టీ అని, అందుకే ప్రజలు ఆదరిస్తున్నారని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండలంలోని ఎన్జీకొత్తపెల్లి, ఉప్పలంచ గ్రామాలకు చెందిన 50 కుటుంబాల వారు వివిధ పార్టీల నుంచి ఆ పార్టీ యువ నాయకుడు గంట శంకర్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎమ్మెల్యే కిశోర్కుమార్ నివాసంలో బుధవారం టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో పుట్ట మహేశ్, ముక్కాముల గణేశ్ పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమాలను చూసే టీఆర్ఎస్లోకి
నాగారం : సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి వివిధ పార్టీలకు చెందిన వారు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ ఉప్పల్లోని ఆయన నివాసంలో నాగారం మండలం పస్తాల గ్రామం కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 50కుటుంబాలు, ఆదర్శ యూత్ క్లబ్ సభ్యులు, యువకులు, నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వీరందరికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మేడే శ్రీకాంత్, కట్ట సాగర్, మేడే అనిల్, భూషణం, శేఖర్, అశోక్, ఆదర్శ యూత్ సభ్యుడు గాజుల కిశోర్తో పాటు పలువురు నాయకులు టీఆర్ఎస్లో చేరిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాగారం మండలాధ్యక్షుడు కల్లెట్లపల్లి ఉప్పలయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండగాని అంబయ్య, టీఆర్ఎస్వీ జిల్లా కో-ఆర్డినేటర్ కల్లెట్లపల్లి శోభన్బాబు, మండల అధికార ప్రతినిధి చిల్లర చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి కేశగాని అంజయ్య, ఉప సర్పంచ్ చిత్తలూరి రమేశ్, మల్యాల అశోక్, గ్రామ శాఖ అధ్యక్షుడు రాచకొండ అంజయ్య, వడ్ల కొండ వెంకన్న, అనిల్, మహేందర్, యాదగిరి పాల్గొన్నారు.