త్రిపురారం, నవవంబర్ 23: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మళ్లీ అంధకారమేనని బీఆర్ఎస్ అభ్య ర్థి, ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. గురువారం మండలంలోని చెన్నాయి పాలెం, అ ల్వాలపాడు, సత్యంపాడుతండా, వస్రాంతండా, గుడితండా, దుబ్బతండా, మాటూరు, చౌళ్లతం డా, బడాయిగడ్డ, డొంకతండా, ఇస్లావత్తండా, రూప్లాతండా, కూన్యా తండా, అప్పలమ్మగూడెం, టీక్యాతండా, మంగల్తండా, బొ ర్రాయిపాలెం, గుడ్డితండా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భగత్ మాట్లాడుతూ సబ్బండవర్గాల సంక్షేమం బీఆర్ఎస్తోనే సాధ్యమని అన్నారు.
నేడు రాష్ట్రం లో కుల, మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని తెలిపారు. కాంగ్రెస్ గ్యారెంటీలు నీటి మూటలే అని ఎద్దేవా చేశారు. అందరూ ఆలోచించి ఓటేసి నియోజకవర్గం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. రెండున్నరేండ్లలో జరిగిన అభివృద్ధి మీకండ్ల ముందే కనిపిస్తుందన్నారు. మీ ఇంట్లో ఒకడిగా ఉన్న నన్ను ఆశ్వీరి దించాలని కోరారు. కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ను మూడో సారి సీఎం చేయాలని సూచించారు.
గ్రామాల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎ మ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మండలంలోని వివిధ గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్తో కలిసి పాల్గొని ఆయన మాట్లాడారు. వర్షంలో కూడా ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్న స్థితి చూస్తుంటే నోముల భగత్ కుమార్ అత్యధిక మెజారిటీతో గెలుస్తారని తేలిపోయిందన్నారు.
గిరిజనుల పాలిట పక్షపాతి సీఎం కేసీఆర్ అని ట్రైకార్ చైర్మన్ రాంచందర్నాయక్ అన్నారు. నోము ల భగత్తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వాలు గిరిజనులను మరిచిపోయారని తెలిపారు. బీఆర్ఎస్ ప్ర భుత్వంలో గిరిజనభవన్ కట్టించి సేవాలాల్ జ యంతిని అధికారికంగా నిర్వహిస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. గిరిజనులంతా కారు గుర్తుపై ఓటు వేసి భగత్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు బహునూతల నరేందర్, నిడమనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రారెడ్డి, మాజీ చైర్మన్ జానయ్య, మాజీ ఎంపీపీ ధూలిపాల రామచంద్రయ్య, మండల ప్రధాన కార్యదర్శి వెంకటాచారి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు కలకొండ వెంకటేశ్వర్లు, మహిళ అధ్యక్షురాలు ధనలక్ష్మి, రైతుబంధు జిల్లా సభ్యులు శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు శ్యాం సుందర్రెడ్డి, త్రిపురారం సర్పంచ్ అనుముల శ్రీనివాస్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ జయ రాంనాయక్, కోటేష్యాదవ్, వెంకన్నయాదవ్, సర్పంచ్లు బాల్తి శ్రీను, సుశీల్, రమేష్రెడ్డి, నాయకులు సత్యం, తిప్పనబోయిన నాగరాజు, బొలిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.