నల్లగొండ, మార్చి 14 : పరిశ్రమల శాఖలో డిప్యూటీ డైరెక్టర్స్ నుంచి రాయల్ ఇన్స్పెక్టర్స్ వరకు పని చేస్తున్న అధికార యంత్రాంగానికి ప్రభుత్వం స్థాన చలనం కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా మైనిగ్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్న డిప్యూటీ డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, అసిస్టెంట్ జియాలజిస్టులతో పాటు రాయల్టీ ఇన్స్పెక్టర్స్ను బదిలీ చేస్తూ మైనింగ్ అండ్ జియాలజీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బెనహర్ మహేష్ దత్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏడీల నుంచి ఆర్ఐల వరకు ఏడుగురు అధికారులు ఇతర జిల్లాలకు ట్రాన్స్ఫర్ కాగా ఇతర జిల్లాల నుంచి మన జిల్లాకు తొమ్మిది మంది అధికారులు బదిలీపై వచ్చారు. వెంటనే ప్రస్తుతం పని చేస్తున్న స్థానాల్లో రిలీవ్ అయి కొత్త స్థానాల్లో జాయిన్ కావాలని ఆదేశించారు.