నల్లగొండ విద్యా విభాగం (రామగిరి), మే 19 : మహాత్మాగాంధీ యూనివర్సిటీ నల్లగొండ ఉమ్మడి జిల్లా పరిధిలో కొనసాగుతున్న డిగ్రీ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన ముగ్గురు విద్యార్థులను అధికారులు డీబార్ చేశారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగిన నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5,461 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 5,132 మంది హాజరయ్యారు. 236 మంది గైరాజరయ్యారు.
ఈ పరీక్షలో సూర్యాపేటలోని ఆర్కే ఎల్కే డిగ్రీ కళాశాలలో ఇద్దరు, ఆలేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒకరు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతూ డీబార్ అయినట్లు ఎంజీయూ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ జి.ఉపేందర్ రెడ్డి వెల్లడించారు. అదేవిధంగా మధ్యాహ్నం జరిగిన ఐదో సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలకు 990 మంది హాజరు కావాల్సి ఉండగా 91 మంది హాజరయ్యారు. 89 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలను పట్టిష్టంగా నిర్వహించాలని ఆయా పరీక్ష కేంద్రాల చీఫ్స్కు సూచించారు. ఎక్కడైనా తప్పు జరిగితే ఆ పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ బాధ్యులవుతారని తెలిపారు.