చందంపేట (దేవరకొండ), ఆగస్టు 14 : దేవరకొండ పట్టణంలోని వివిధ వార్డుల్లో విద్యుత్ సమస్య తలెత్తకుండా చూడాలని స్థానిక ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. గురువారం పట్టణంలోని విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత మూడు రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ సమస్య తలెత్తకుండా, లో వోల్టేజీ సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.