రామగిరి, మార్చి 07 : మహిళ లేనిదే మనుగడ లేదని, మానవ జీవితంలో మహిళ ఎన్నో పాత్రల్లో తన ఔన్యత్యాన్ని, గొప్పతనాన్ని, త్యాగనిరతిని చాటుతుందని సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ అన్నారు. శనివారం నల్లగొండ పట్టణం మర్రిగూడ ఎం.వి.ఆర్ గెలాక్సీ పాఠశాలలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సృష్టికి మూలం స్త్రీ మూర్తి అని కొనియాడారు. సమాజంలో మహిళలను గౌరవించడం ప్రతి వ్యక్తి బాధ్యతని, విద్యార్థులకు మహిళల గొప్పతనాన్ని చిన్నతనం నుండే వివరించి సమాజంలో వారిని గౌరవించే విధంగా చూడాలని ఆయన పేర్కొన్నారు. అనంతరం పాఠశాల మహిళా టీచర్లను, సిబ్బందిని శాలువా, మెమెంటులతో సత్కరించారు. పాఠశాల వ్యవహర్త డాక్టర్ జి.వి రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉమారాణి, గంగాభవాని, రాగిణి, శృతి, వినీత, లావణ్య, ప్రసన్న కుమారి, లక్ష్మి, ఉమారాణి, అనిత, యాదమ్మ, రాములమ్మ, మర్రి గణేష్, రాజు పాల్గొన్నారు.

మహిళ లేనిదే మనుగడ లేదు : డా.కేశవులు ముదిరాజ్