హాలియా, డిసెంబర్ 20 : రాష్ట్రంలోని సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. రాష్ట్రంలోని ప్రాథమిక సహకార పరపతి సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీని ప్రకటిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేయడాన్ని స్వాగతిస్తూ మంగళవారం నాగార్జునసాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పీఏసీఎస్ చైర్మన్లు, ఉద్యోగులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యే నోముల భగత్తో కలిసి సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వరాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదన్నారు. పారిశుధ్య కార్మికులు మొదలు అంగన్వాడీ, ఆశ వర్కర్స్తోపాటు అన్ని శాఖల్లో పనిచేసే ప్రభుత్వ, ప్రభుత్వేతర ఒప్పంద ఉద్యోగులందరికీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచడంతోపాటు వారికి అన్ని సౌరర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పీఏసీఎస్లో పనిచేసే ఉద్యోగుల చిరకాల వాంఛ హెచ్ఆర్ చెల్లింపు కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించి జీఓ జారీ చేయడం హర్షణీయమన్నారు.
కేంద్రం ఆర్థిక ఇబ్బదులకు గురి చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా వెనకడుగు వేయకుండా ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్నదన్నారు. పెద్దవూర, త్రిపురారం, నిడమనూరు, గుర్రంపోడు పీఏసీఎస్ చైర్మన్లు గుంటుక వెంకట్రెడ్డి, జైరాంనాయక్, విజయభాస్కర్, మందడి నాగేందర్రెడ్డి, వైస్ చైర్మన్లు గజ్జెల శ్రీనివాస్రెడ్డి, గుండెబోయిన వెంకన్న, డైరెక్టర్లు బొమ్మిశెట్టి ఆంజనేయులు, సీఈఓలు రావుల సత్యం, జానకిరాములు, ఐదగోని వెంకటయ్య, గడ్డం వెంకట్రెడ్డి, సైదులు, నగిరి విజయ్, ధనావత్ శ్రీనునాయక్, గౌతమ్రెడ్డి, కోళ్ల సైదులు, విష్ణువర్ధన్రెడ్డి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు చేరుపల్లి ముత్యాలు, పోశం శ్రీనివాస్గౌడ్, సురభి రాంబాబు, పొదిల శ్రీనివాస్, రావుల లింగయ్య, బుర్రి మొగులయ్య పాల్గొన్నారు.