బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుక సందర్భంగా తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన గురువారం జరిగిన బీఆర్ఎస్ ప్రతినిధుల సభలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ముఖ్య ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొన్నారు.
మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి నేతృత్వంలో జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు తరలివెళ్లారు. ప్లీనరీ ప్రాంగణంలో సీఎం కేసీఆర్తో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, భాస్కర్రావు, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఉన్న ఫొటో ఇది.