రామగిరి, మే 9 : ఇంటర్మీడియట్ ఫలితాల్లో నల్లగొండ జిల్లా తిరోగమనం వైపుగా పయనించింది. గతంతో చూస్తే ఈ సంవత్సరం ఫలితాలు తగ్గాయి. గతేడాది జిల్లా రాష్ట్రంలో 6వ స్థానంలో నిలువగా.. ఈ సారి మాత్రం ప్రథమ సంవత్సర ఫలితాల్లో రాష్ట్రంలో 13వ స్థ్ధానం, ద్వితీయ సంవత్సరంలో 12వ స్థానానికి దిగజారింది. మొత్తంమీద ఇంటర్ పలితాల్లో బాలుర కంటే బాలికలే ముందంజలో నిలిచారు. మరోవైపు కసూర్బా, గురుకుల పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలతో సత్తాచాటారు. సీనియర్ ఇంటర్లో ఎంపీసీ విభాగంలో 993, జూనియర్లో 467 మార్కులు, బైపీసీలో ప్రథమ సంవత్సరంలో 436, ద్వితీయ లో 990 మార్కులు రావడం గమనార్హం.
ఫలితాలు ఇలా…
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 12,408మంది విద్యార్థులు హాజరుకాగా 6,789 మంది ఉత్తీర్ణత సాధించగా 54 శాతం ఫలితాలు వచ్చాయి. రాష్ట్ర స్థాయిలో 13వ స్థానం కైవసం చేసుకొంది. వీరిలో జనరల్ విభాగంలో బాలురు 5,929 మంది హాజరుకాగా 2,847మంది ఉత్తీర్ణత సాధించి 48 శాతం ఫలితాలు వచ్చాయి. బాలికలు 6,479మంది హాజరుకాగా 3,942 మంది ఉత్తీర్ణత సాధించి 60 శాతం ఫలితాలు వచ్చాయి. గత సంవత్సరం ప్రథమ సంవత్సరంలో రెగ్యులర్ విభాగంలో 13,417 మంది విద్యార్థులు హాజరు కాగా 8,217 మంది ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో 6వ స్థానం దక్కింది. అయితే ఈ సంవత్సరం 7 శాతం ఫలితాలు తగా ్గయి. ద్వితీయ సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 12, 324 మంది హాజరుకాగా 7,889 మంది ఉత్తీర్ణత సాధించగా 64 శాతం ఫలితాలు వచ్చా యి. దాంతో రాష్ట్ర స్థాయిలో 12వ స్థానం దక్కిం ది. వీరిలో బాలురు 5907 మంది హాజరుకాగా 3361మంది ఉత్తీర్ణత సాధించి 56 శాతం ఫలితాలు వచ్చాయి. బాలికలు 6417మంది హాజరుకాగా 4528 మంది ఉత్తీర్ణత సాధించగా 70 శాతం ఫలితాలు వచ్చా యి. గతేడాది ద్వితీయ సంవత్సరంలో మొత్తం 13614 మంది విద్యార్థులకు 9369 మంది ఉత్తీర్ణులై 68 శాతం ఫలితాలు రాగా రాష్ట్ర స్థాయిలో 6వ స్థానం దక్కింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సారి 6శాతం ఫలితాలు తగ్గాయి.
ఒకేషన్లో విభాగంలో
ప్రథమ సంవత్సరం ఒకేషనల్ విభాగంలో 2507 మంది హాజరుకాగా 1257 మంది ఉత్తీర్ణత సాధించగా 50 శాతం ఫలితాలు వచ్చాయి. వీరిలో బాలురు 1427 మందికి 557మంది ఉత్తీర్ణులవగా, బాలికలు 1080 మందికి 700 మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాది 69శాతం ఫలితాలు వచ్చాయి. సెంకడియర్ ఒకేషనల్లో 2412 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 1611 మంది ఉత్తీర్ణత సాధించారు. 66 శాతం ఫలితాలు వచ్చాయి. వీరిలో బాలురు 1374 మందికి 781మంది, బాలికలు 1038 మందికి 830 మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాది 74శాతం ఫలితాలు వచ్చాయి.
గత ఫలితాలు ఇలా..
నల్లగొండ ‘గౌతమి’ విజయ దరహాసం
రామగిరి, మే 9 : ఇంటర్మీడియేట్ ఫలితాల్లో నల్లగొండలోని గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఎంపీసీలో 993 మార్కులతో విజయదుందుబి మోగించారు. ఎంపీసీలో ఎం.అక్షిత 993/1000 రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం దక్కించుకుంది. అలాగే బైపీసీలో నిషాత్ ఫాతిమా, ఎ.పూజిత 987/1000 సాధించారు. ఫస్టియర్ ఎంపీసీలో షేక్ అఫ్రిన్, ఎండీ.అబ్దుల్ రెహమాన్ 467, బద్దం సాయిశ్రీ, గజ్జల పూజిత, శ్రీవర్షిణి, వడ్డి పూజితకు 466 మార్కులు వచ్చాయి. బైపీసీలో షెహనా అలీఖాన్కు 435 మార్కులు వచ్చినట్లు వెల్లడించారు. విద్యార్థులను కళాశాల డైరెక్టర్లు కాసర్ల వెంకట్రెడ్డి, చల్లా వెంకటరమణ, కొమ్మిడి రఘుపాల్రెడ్డి, పుట్ట వెంకటరమణారెడ్డి అభినందించారు.
‘నీలగిరి’ విద్యార్థుల సత్తా
రామగిరి, మే 9 : ఇంటర్మీడియేట్ ఫలితాల్లో నల్లగొండలోని రామగిరిలో గల నీలగిరి జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తాచాటారు. సెకండియర్ ఎంపీసీలో ఎన్.వైష్ణవి 981, బీపీసీలో 976 మార్కులు సాధించారు. అలాగే ఫస్టియర్ ఎంపీసీలో జె.మానస 456, బీపీసీలో ఆర్.మమత 416 మార్కులతో ఉత్తమ ఫలితాలు సాధించారు. విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్ మారం నాగేందర్రెడ్డి, అధ్యాపకులు అభినందనలు తెలిపారు.
ఫలితాల్లో గీతాంజలి ప్రభంజనం
రామగిరి, మే 9 : ఇంటర్మీడియేట్ ఫలితాల్లో నల్లగొండలోని గీతాంజలి విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో డి.ఇందూ 992, జి.లిఖితారెడ్డి 987 మార్కులు సాధించారు. బైపీసీలో జి.శ్రావణి 980 సాధించగా ఫస్టియర్ ఎంపీసీలో ఆర్.నిఖిత 466, సీహెచ్.సౌమ్య 464, బీపీసీలో సీహెచ్.చంద్రిక 436, పూజిత 433 మార్కులు సాధించారు. విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్.మల్లారెడ్డి, డైరెక్టర్లు ఎ.విమోచన్రెడ్డి, కె.రాజేందర్రెడ్డి, ఎ.జనార్దన్రెడ్డి అభినందించారు.
ఇంటర్ ఫలితాల్లో ‘ప్రగతి’ ఫ్రభంజనం
రామగిరి, మే 9 : ఇంటర్ ఫలితాల్లో నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రగతి జూనియర్ కళాశాల ఉత్తమ ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించింది. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో రాయినబోయిన మౌనిక 467/470, పోగుల పూజిత 466, ఎ.వైష్ణవి, రమ్యశ్రీ, శ్రీజ, హరిత, సిరిసాయి, వెన్నెల, పూజాలు 465 సాధించారు. బీపీసీలో కేతిరెడ్డి చందనదుర్గ 434/440, కె.విష్ణుకుమార్ 433, అనురాధ 432 సాధించారు. అలాగే ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో వి.సిరి 990/1000, యు.గౌతమి 989, బీపీసీలో బి.శ్రీలేఖ, కూరెళ్ల జోతిర్మయి, దీపక్కుమార్ 990, వేద చేపూరి 989 సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు కళాశాల చైర్మన్ చందా కృష్ణమూర్తి, డైరెక్టర్లు ఎ.నరేందర్బాబు, ఎన్.శశిధర్రావు, చందా శ్రీనివాస్, పైళ్ల రమేష్రెడ్డి అభినందనలు తెలిపారు.