రామగిరి, సెప్టెంబర్ 17 : సబ్బండ వర్గాల సంక్షేమమే సర్కారు లక్ష్యమని జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి అన్నారు. జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ఆదివారం జడ్పీలో జాతీయ జెండా ఎగురవేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రాధాన్యత కల్పిస్తూ రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా ఉండేలా చేశారని తెలిపారు. తొమ్మిదేండ్ల కాలంలోనే తెలంగాణ ఎంతో అభివృద్ది చెందిదన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ సారధ్యంలోనే అన్ని వర్గాలకు సమన్యాయం
సీఎం కేసీఆర్ సారధ్యంలో అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. జాతీయ సమైక్యతా దినోత్సవం నల్లగొండలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సెప్టెంబర్ 17ను తెలంగాణ సమైక్యతా దినోత్సవంగా వేడుకలు చేసేలా ఈ రోజు విశిష్టతను నేటి యువతరం, ప్రజలకు తెలిపిన మహోన్నతుడు సీఎం కేసీఆర్ అన్నారు.
ప్రజలంతా సీఎం కేసీఆర్ సారధ్యంలో మళ్లీ ప్ర భుత్వం రావాలని ఆకాంక్షించడంతో బీఆర్ఎస్ వైవే మద్దతు తెలిపి స్వాగతిస్తున్నారని తెలిపారు. ఈ వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పార్టీ పట్టణాధ్యక్షకార్యదర్శులు బోనగిరి దేవేందర్, జనార్దన్రావు, మున్సిపల్ ప్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, మహిళా నాయకురాలు మాలె శరణ్యారెడ్డి పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమం దేశానికే ఆదర్శం
నకిరేకల్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసిఆర్ పదేండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం నకిరేకల్ క్యాంపు కార్యాలయంలో, ఐసీడీఎస్ కార్యాలయంలో, మున్సిపల్ కార్యాలయంలో జెండావిష్కరించి జాతీయ గీతాలపన చేశారు. అంతకుముందు తెలుగుతల్లి చిత్రపటానికి పూలమాల వేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేని ప్రతిపక్ష పార్టీలు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. జాతీయ సమైక్యత దినోత్సవంపై కాంగ్రెస్, బీజేపీలు రాజకీయ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాద ధనలక్ష్మీనగేష్గౌడ్, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రదీప్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పల్రెడ్డి మహేందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బాలాజీ, సీఐలు రాఘవరావు, రాజశేఖర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రగడపు నవీన్రావు పాల్గొన్నారు.
పేదల సంక్షేమానికి పెద్ద పీట
మునుగోడు : పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మండల వ్యాప్తంగా క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. సంఘటితంగా పోరాడి సాధించిన విజయాలకు ఇది గుర్తుగా నిలుస్తుందన్నారు. ఈ ప్రాంతం ప్రజలు మరో సారి కూడ బీఆర్ఎస్ ప్రభుత్వానికే మద్దతు పలికి మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండ పురు షోత్తంరెడ్డి, ఎంపీటీసీలు,బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కార్యాలయాల్లో..
రామగిరి : కలెక్టరేట్లో కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ జాతీయ జెండా ఎగురవేయగా అదనపు కలెక్టర్లు శ్రీనివాస్, పాటిల్ హేమంత్ కేశవ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అపూర్వరావు తొలుత పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జెండా ఎగరవేశారు. మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి ఆవిష్కరణ చేయగా వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్గౌడ్, కమిషనర్ రమణాచారి, కౌన్సిలర్ పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థలో చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి ఆవిష్కరణ చేశారు. జైల్లో సూపరింటెండెంట్ దేవ్లా పాల్గొన్నారు.