సూర్యాపేట టౌన్, జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం జరిగిన వేడుకల్లో శకటాలు, స్టాల్స్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి నాయకత్వంలో తొమ్మిదేండ్లుగా కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శకటాలు, స్టాల్స్ అద్భుతంగా ప్రదర్శించారు. ప్రదర్శనలను మంత్రి తిలకించి సబంధిత శాఖలను అభినందించారు.
మున్సిపాలిటీ, పశు వైద్య సంవర్ధక శాఖ, జిల్లా పరిశ్రమల, మత్స్య, అటవీ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ, మిషన్ భగీరథ, నీటి పారుదల ఆయకట్టు అభివృద్ధి, పౌర సరఫరాల, మహిళా శిశు సంక్షేమ, వ్యవసాయ, షెడ్యూల్డ్ కులాల సహకార, రెవెన్యూ, వైద్యారోగ్య, ఉద్యానవన, విద్యా, పంచాయతీ విభాగం, గ్రామీణాభివృద్ధి శాఖలు రూపొందించిన శకటాలు అందరినీ ఆకట్టుకున్నాయి. డీపీఆర్ఏ, డీఆర్డీఓ, మున్సిపల్, డీఎస్సీడీఓ, డీఎస్బీసీడీఓ, డీఈఓ, డీటీడీఓ, ఆర్డబ్ల్యూఎస్, డీవీఏహెచ్ఓ, ఐసీడీఎస్, డీఆర్డీఓ, టీఎస్ఆర్టీసీ, అగ్రికల్చర్, డీఎంహెచ్ఓ, ఆర్అండ్బీ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.