సంస్థాన్ నారాయణపురం, ఏప్రిల్ 3: రాష్ట్ర ప్రభుత్వం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీతో కలిసి 13వ ఏషియా టెక్స్టైల్ సదస్సు 2026ను శుక్రవారం హైదరాబాద్ హైటెక్ సిటీలోని నోవాటెల్లో నిర్వహించారు. సదస్సుకు సీఎం రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అటెక్స్కాన్ 2026 నివేదికను విడుదల చేశారు.
పోచంపల్లి సిల్క్ ఇక్కత్ వస్ర్తాల విభాగంలో రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు పుట్టపాక గ్రామానికి చెందిన జాతీయ అవార్డు గ్రహీత గజం నర్మద నరేందర్ స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్ను సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు దుద్దిల శ్రీధర్బాబు, తుమ్మల నగేశ్వర్రావు సందర్శించి పుట్టపాక చేనేత వస్త్రల గురించి అడిగి తెలుసుకున్నారు.