HomeNalgondaThe Cm Cup 2023 Sports Competitions Started With A Bang Across The Joint District
సీఎం కప్ గేమ్స్ షురూ
డాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, మరింతగా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో తలపెట్టిన సీఎం కప్-2023 క్రీడా పోటీలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ముందుగా మండల స్థాయిలో అక్కడ గెలుపొందిన వారితో జిల్లా స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం
ఆటలు ఆరంభించిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు
తొలి రోజు ఉత్సాహంగా సాగిన క్రీడలు
క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, మరింతగా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో తలపెట్టిన సీఎం కప్-2023 క్రీడా పోటీలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ముందుగా మండల స్థాయిలో అక్కడ గెలుపొందిన వారితో జిల్లా స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సోమవారం అన్ని నియోజకవర్గాల్లోనూ మండల స్థాయి సీఎం కప్ క్రీడల పోటీలు మొదలయ్యాయి. ఎమ్మెల్యేలతోపాటు కొన్నిచోట్ల ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లా స్థాయి అధికారులు ఆటల పోటీలను షురూ చేశారు. కట్టంగూర్లో స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ పోటీలను ప్రారంభించారు.
నల్లగొండలోని మేకల అభినవ్ స్టేడియంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి.. నకిరేకల్లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.. మునుగోడు, చండూరులో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి.. దామరచర్ల, వేములపల్లిలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు.. గుర్రంపోడులో ఎమ్మెల్యే నోముల భగత్కుమార్.. తిరుమలగిరిసాగర్, పెద్దవూర, హాలియాలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి.. హుజూర్నగర్లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి.. కోదాడ, నడిగూడెం, మోతె, చిలుకూరులో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఆటల పోటీలకు శ్రీకారం చుట్టారు. మాడ్గులపల్లిలో నల్లగొండ డీఈఓ భిక్షపతి, సూర్యాపేట మండలం టేకుమట్లలో ఎస్పీ రాజేంద్రప్రసాద్ క్రీడా పోటీలను ప్రారంభించారు. అన్ని మండలాల్లో పోటీలు జరుగుతుండడంతో క్రీడాకారులతో సందడి నెలకొన్నది. వేసవి కావడంతో అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టినట్లు సూర్యాపేట కలెక్టర్ ఎస్. వెంకట్రావ్, నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్ కుష్బూగుప్తా వెల్లడించారు.
– నల్లగొండ ప్రతినిధి, మే 15 (నమస్తే తెలంగాణ)
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్-2023 క్రీడా పోటీలు సోమవారం జిల్లా వ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు క్రీడలను ప్రారంభించి ఆటలు ఆడి యువతలో ఉత్సాహం నింపారు. మండల స్థాయిలో నిర్వహించే అథ్లెటిక్స్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్బాల్ (పురుషులకు మాత్రమే) పోటీలకు గ్రామీణ యువతీ యువకులు ఉత్సాహంతో పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఈ నెల 17వ తేదీ వరకు నిర్వహించే ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను 22నుంచి జరిగే జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు.
క్రీడలు మానసికోల్లాసాన్ని పెంపొందిస్తాయి
రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్
కట్టంగూర్, మే 15 : క్రీడలు మానసికోల్లాసంతోపాటు శారీరక దారుఢ్యాన్ని పెంపొందిస్తాయని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలను సోమవారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. యువతలోని ప్రతిభను వెలికితీస్తూ జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే సీఎం కప్ లక్ష్యమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ జెల్లా ముత్తిలింగయ్య, జడ్పీటీసీ తరాల బలరాములు, పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు. ఎంపీడీఓ పోరెళ్ల సునీత, ఎంపీఓ మహ్మద్ అథర్ ఫర్వేజ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు గుర్రం సైదులు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు పాలడుగు హరికృష్ణ, ఏపీఓ కడెం రామ్మోహన్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు, నాయకులు పాల్గొన్నారు.
క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకే..
హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
హుజూర్నగర్ రూరల్, మే 15 : గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించడంతోపాటు వారిలో నైపుణ్యాలను వెలికితీయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నదని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంప్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడలను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ క్రీడలకు ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు ముడెం గోపిరెడ్డి, కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామచంద్రుగౌడ్, సర్పంచ్ సైదేశ్వర్రావు, నాయకులు పాల్గొన్నారు.
యువత క్రీడల్లో రాణించాలి
నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్
గుర్రంపోడు, మే 15 : గ్రామాల్లో స్నేహపూర్వక వాతావరణం కలిగి యువతీ యువకులు క్రీడల్లో రాణించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం కప్ క్రీడా పోటీలు ఏర్పాటు చేశారని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన సీఎం కప్ క్రీడా పోటీలను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. పేద విద్యార్థులు, యువతీ యువకుల్లో ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకే ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను విద్యతోపాటు క్రీడలపైనా దృష్టి సారించేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ శ్రీపాద సుధాకర్, వైస్ ఎంపీపీ వజ్జ రామేశ్వరీధనుంజయ్, పీఏసీఎస్ చైర్మన్ ఆవుల వెంకన్నయాదవ్, బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రామగిరి చంద్రశేఖర్రావు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
క్రీడల్లో యువతను ప్రోత్సహించేందుకే ఆటల పోటీలు
మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి
చండూరు, మే 15 : గ్రామీణ యువతను క్రీడల్లో ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం కప్ పోటీలను ప్రవేశపెట్టారని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలను సోమవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ పల్లె కళ్యాణి, జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళావెంకన్న, తాసీల్దార్ అర్చనారెడ్డి, ఎంపీడీఓ యాకూబ్నాయక్, మున్సిపల్ కమిషనర్ ఎండీ ఖాజామొయినుద్దీన్, కౌన్సిలర్ కొన్రెడ్డి యాదయ్య, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
గ్రామీణ యువతక్రీడా ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకే
నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి
నల్లగొండ రూరల్, మే 15 : గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీసేందుకే రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ టోర్నమెంట్ నిర్వహిస్తుందని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి క్రీడా పోటీలను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించడంతోపాటు ప్రాక్టీస్ చేసేందుకు స్టేడియాలను ఆధునీకరించిందన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి కాసేపు ఆటలు ఆడారు. కార్యక్రమంలో ఎంపీపీ సుమన్, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్గౌడ్, జిల్లా క్రీడల అధికారి మగ్బూల్ అహ్మద్, డీఆర్డీఏ అడిషనల్ పీడీ శైలజ, ఎంపీడీఓ వై.శ్రీనివాస్రెడ్డి, ఎంఈఓ అరుంధతి, ఎంపీఓ జూలకంటి మాధవరెడ్డి, పీఈటీలు పాల్గొన్నారు.
క్రీడలకు ప్రాధాన్యమిస్తున్న సర్కారు
మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు
దామరచర్ల, మే 15 : క్రీడలకు ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులకు అన్ని రకాల ప్రోత్సాహం అందిస్తున్నదని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ క్రీడాపోటీలను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడలను, క్రీడాకారులను గత పాలకులు ఎన్నడూ పట్టించుకోలేదన్నారు. సీఎం కప్ క్రీడా పోటీలతో ఉత్తమ క్రీడాకారులను గుర్తించి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఎంపీపీ డి.నందిని, జడ్పీటీసీ ఆంగోతు లలిత, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ డి.నారాయణరెడ్డి, ఎంపీడీఓ జానయ్య, ఎంపీటీసీలు సోము సైదిరెడ్డి, బాల లక్ష్మి, బీఆర్ఎస్ నాయకులు వీరకోటిరెడ్డి, యూసుఫ్, వెంకటేశ్వర్లు, పెద్ద కోటిరెడ్డి, నర్సయ్య, వీరబాబు, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణకు జాతీయ స్థాయిలో పేరు తేవాలి
ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
తిరుమలగిరి సాగర్, మే 15 : గ్రామీణ క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా ప్రోత్సహిస్తున్నదని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న సీఎం కప్ టోర్నమెంట్ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులతో కనిసి సరదాగా కబడ్డీ ఆడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించి రాష్ర్టానికి పేరు తీసుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆంగోతు భగవాన్నాయక్, జడ్పీటీసీ సూర్య, తాసీల్దార్ పాండునాయక్, ఎంపీడీఓ ఖాజా అస్గర్ అలీ, స్థానిక సర్పంచ్ శ్రావణ్కూమర్ రెడ్డి, ఎంపీటీసీ రాజశేఖర్రెడ్డి, ఎస్ఐ పి.బాబు, ఏఓ జానకిరాములు, నాయకులు పాల్గొన్నారు.
క్రీడాకారులకుప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్
దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్
మాల్, మే 15 : గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కప్ పేరుతో మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. చింతపల్లి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ఆవరణలో నిర్వహిస్తున్న మండల స్థాయి క్రీడా పోటీలను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. సీఎం కప్ క్రీడలు నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.3,60కోట్లు కేటాయించిందన్నారు. క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 2శాతం, ఉన్నత విద్య అభ్యసించేందుకు 0.5శాతం రిజర్వేషన్ కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కొండూరి భవాని, జడ్పీటీసీ కంకణాల ప్రవీణ, ఎంపీడీఓ రాజు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంకణాల వెంకట్రెడ్డి పాల్గొన్నారు.
గ్రామీణ క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలి
నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నకిరేకల్, మే 15 : గ్రామీణ క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించి రాష్ర్టానికి, దేశానికి ఎన్నో విజయాలు తెచ్చి పెట్టాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కబడ్డీ ఆడి క్రీడాకారుల్లో జోష్ నింపారు. సీఎం కప్ పోటీల్లో గెలుపొందిన జట్లకు మొదటి బహుమతి రూ.10వేలు, ద్వితీయ బహుమతి రూ.5వేలు చిరుమర్తి చేయూత ఫౌండేషన్ తరఫున అందిస్తామని చెప్పారు. ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవీగంగాధర్రావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మాద ధనలక్ష్మీనగేశ్, తాసీల్దార్ గుగులోతు ప్రసాద్నాయక్, ఎంపీడీఓ ఇంద్రకంటి ఆండాలు, ఎంఈఓ నాగయ్య, శాలిగౌరారం సీఐ రాఘవరావు, ఉపాధ్యాయులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
క్రీడల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్
కోదాడ రూరల్, మే 15 : గ్రామీణ ప్రాంత క్రీడాకారులను వెలుగులోకి తీసుకు రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం క్రీడా పోటీలు నిర్వహిస్తున్నదని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం పట్టణ, మండల స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించి మాట్లాడారు. అనంతరం వాలీబాల్, కబడ్డీ క్రీడాకారులతో కాసేపు సరదాగా ఆడి ఉత్సాహం నింపారు. కార్యక్రమంలో ఎంపీపీ చింతా కవితారెడ్డి, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, ఎంపీడీఓ విజయశ్రీ, ఎంఈఓ సలీంషరీఫ్, కౌన్సిలర్లు ఖాజాభాయ్, ఖదీర్, నిరంజన్రెడ్డి, నయీం, ఎస్కే బాగ్దాద్, నాయకులు సత్యబాబు, మధు, నర్సింహారావు, సురేశ్నాయుడు, కల్యాణ్ పాల్గొన్నారు.