చిట్యాల, ఫిబ్రవరి 26 : పేదలు ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కోరారు. మండలంలోని ఉరుమడ్ల గ్రామానికి చెందిన గంగాపురం ఆండాలుకు మంజూరైన రూ.2లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును చిట్యాల పాల కేంద్రంలో ఆదివారం అందించారు.
అనంతరం మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు సీఎంఆర్ఎఫ్ దోహద పడుతుందన్నారు. కార్యక్రమంలో గుత్తా యువసేన జిల్లా అధ్యక్షుడు వనమా వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ పొలగోని స్వామి, మర్రి రమేశ్, గంగాపురం వెంకన్న, గుత్తా వెంకట్రాంరెడ్డి, హనుమంతు పాల్గొన్నారు.