సూర్యాపేట, అక్టోబర్ 30: ఎన్నికల వేళ అక్రమాలు జరగ కుండా అధికారులు సరిహద్దుల్లో నిఘా కట్టుదిట్టం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు నగదు, వస్తువులు, మద్యం, ఇలా ప్రలోభాలకు గురిచేసే ఏ వస్తువు రా కుండా సరిహద్దులలో చెక్ పోస్టులను ఏర్పాటుచేశారు. చెక్పో స్టుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని కలెక్టరేట్లో మానిట రింగ్ చేస్తున్నారు.
ఎన్నికల సమీపిస్తుండటంతో ఎన్నికల అధికారులు జిల్లాలో 24గంటల పాటు తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లా సరిహద్దుల నుంచి వస్తున్న అక్రమ నగదు, మద్యం, వస్తువులను అడ్డుకునేందుకు జిల్లా అధికారులు ఏడు అంతర్రాష్ట్ర సరిహద్దులు, ఎనిమిది అంతరజిల్లా సరిహద్దులను ఏ ర్పాటుచేసి నిరంతరం తనిఖీలు చేపడుతున్నారు. అనుమతు ల్లేకుండా జిల్లాలోకి వస్తున్న నగదు, బంగారం, మద్యం, ఇతర వస్తువు లు సీజ్చేసి జిల్లా అధికారులకు అప్పగిస్తున్నారు. ప్రతి చెక్ పోస్టు వద్ద రెండు చొప్పున సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. వాహనం తనిఖీచేసే విధా నం రికార్డు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
సూర్యాపేట జిల్లాకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుతో పాటు నల్గొండ, జనగాం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు సరిహద్దులు. ఈ ప్రాంతాలకు రాకపోకలు జరిపే 15 ప్రాంతాలను గుర్తించిన అధికారులు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. అంతర్రాష్ట చెక్ పోస్టులైన చింత్రియాల, మఠంపల్లి, మహాంకాళిగూడెం, పులిచింతలప్రాజెక్ట్, బుగ్గమాదారం, దొండపహాడ్, రాంపురం ఎక్స్ రోడ్డు. అంతర్జిల్లా చెక్ పోస్టులు మామిళ్లగూడెం, శాంతినగర్, టెకుమట్ల, బీమారం, కుంటపల్లి, తిరుమలగిరి, వెలిశాల ఎక్స్ రోడ్డు, జుపాడుల వద్ద ఈ చెక్ పోస్టులను ఏర్పాటుచేశారు. ఒక్కొక్క చెక్ పోస్టు వద్ద 2 సీసీ కెమెరాల చొప్పున 30 సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి పర్యవేక్షిస్తున్నారు. చేశారు. వాటి లింక్లను కలెక్టరేట్లోని ఐటీ వింగ్ రూంకు కనెక్ట్ చేసి మానటరింగ్ చేస్తున్నారు. చెక్ పోస్టుల వద్ద 24 గంటల పాటు తనిఖీ చేసేలా సిబ్బందిని నియమించారు.
ఎన్నికల కోడ్ అమలైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు చెక్ పోస్టుల వద్ద రూ. 1.05కోట్లు నగదు, వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మఠంపల్లి చెక్ పోస్టు వద్ద రూ.13,03,000 నగదు పట్టుబడగా పులిచింతల ప్రాజెక్ట్ చెక్ పోస్టు వద్ద రూ. 4,74,500 నగదు ,దొండ పహాడ్ వద్ద రూ. 2,00,000నగదు రాంపురం ఎక్స్ రోడ్డు వద్ద నగదు, ఇతర వస్తువుల కలిపి దాదాపు 86,12,868పట్టుబడినట్లు అధికారులు చెప్పారు.