బొడ్రాయిబజార్, ఏప్రిల్ 18 : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్కు ధాన్యం రాక పెరుగుతూనే ఉంది. మంగళవారం మార్కెట్కు 32,587 బస్తాల ధాన్యం వచ్చింది. మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎండీ. ఫసియొద్దీన్ నిత్యం పర్యవేక్షిస్తూ.. మద్దతు ధర పలికేలా చర్యలు తీసుకున్నారు.
జైశ్రీరాం రకం 14064 బస్తాలు రాగా రూ. 1509 నుంచి 2442, బీపీటీ కొత్తవి 149 బస్తాలు రాగా రూ.1609 నుంచి 1669, ఐఆర్ 64 రకం 11061బస్తాలు రాగా రూ. 1409 నుంచి 1735, హెచ్ఎంటీ 6600 బస్తాలు రాగా రూ. 1539 నుంచి 2272, ఆర్ఎన్ఆర్ 237 బస్తాలు రాగా రూ. 1439 నుంచి 2083, 1001 రకం 24 బస్తాలు రాగా రూ. 1446 ధర లభించిది. సూర్యాపేట మార్కెట్లో అధికారుల పర్యవేక్షణ ఫలితంగా మద్దతుకు మించి ధర వస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.