ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి
భువనగిరి అర్బన్, జూన్ 4 : సీఎం కేసీఆర్ సారథ్యంలోనే రాష్ట్రంలోని ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. పట్టణ పరిధిలోని రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని సునీతామహేందర్రెడ్డి దంపతులు శనివారం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రభుత్వ విప్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్తోనే ఆలయాలకు పూర్వ వైభవం వచ్చిందని, అందుకు నిదర్శనమే యాదాద్రి దేవాలయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి దంపతులను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామానికి చెందిన గుణగంటి బాబూరావు వేలంపాట దక్కించుకుని ఏర్పాటు చేసిన కొబ్బరికాయల దుకాణాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో యాదగిరిగుట్ట జడ్పీటీసీ అనూరాధ, ఆలేరు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
గుండాల : ప్రజలు భక్తిభావంతో మెలగాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, నల్లగొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని తుర్కలశాపూరంలో జరిగిన ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన, బొడ్రాయి, పెద్దమైసమ్మ పండుగలకు వారు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. వారి వెంట ఎంపీపీ తాండ్ర అమరావతి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఖలీల్, వైస్ ఎంపీపీ మహేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీనివాస్,రైతుబంధు సమితి మండల కన్వీనర్ గడ్డమీది పాండరి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు సైదులు, మాజీ ఎంపీపీలు హరితాదేవి, వేణుగోపాల్, ఆల్డా డైరెక్టర్ దశరథ, సర్పంచ్ భిక్షమయ్య, ఉపసర్పంచ్ గణేశ్, యూత్ అధ్యక్షుడు రంజిత్రెడ్డి, టీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు దయాకర్, చెన్నారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.