మిర్యాలగూడ: తెలంగాణ విజయగర్జన సభను టీఆర్ఎస్ శ్రేణులు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. శనివారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మిర్యాలగూడ పట్టణ, మండల టీఆర్ఎస్ ముఖ్య నాయ కుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
నవంబరు 15న వరంగల్లో జరిగే సభకు ప్రతి వార్డు, గ్రామం నుంచి వాహనాలు సమకూర్చుకుని వారి గ్రామ బ్యానర్తో విజయగర్జన సభకు బయలుదేరాలని సూచించారు. టీఆర్ఎస్ ముఖ్య నాయకులంతా కలిసికట్టుగా జన సమీకరణపై దృష్టి పెట్టాలని సూచించారు.
సమావేశంలో మాజీ ఎమ్మె ల్యే తిప్పన విజయసింహా రెడ్డి, మున్సిపల్ చైర్మన్ , పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు తిరునగరు భార్గవ్, జొన్నలగడ్డ రంగారెడ్డి, మట్టపల్లి సైదులు, ఎంపీపీ నూకల సరళారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, పెద్ది శ్రీనివాస్గౌడ్, అమరావతి సైదులు, పూసపాటి రాజయ్య, రేపాల రమేశ్, ప్రసాద్, తిరుపతమ్మ ఉన్నారు.