నల్లగొండ, జనవరి 7: గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షకు దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగించినట్లు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ హెచ్. అరుణకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో ఇంగ్లిష్ మీడియంలో 5వ తరగతిలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
దరఖాస్తు చేసుకున్న వారికి ఫిబ్రవరి 11న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థుల ఎంపిక పాత జిల్లా యూనిట్గా పరిగణించనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని, విద్యార్థులు బోనఫైడ్ లేదా స్టడీ కండక్ట్ సర్టిఫికెట్ను దరఖా స్తు వెంట జత చేయాల్సి ఉంటుందని తెలిపారు.