మునుగోడు, ఏప్రిల్ 28 : రైతులు పంటల సాగులో మెళకువలు సాధిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు అన్నారు. మంగళవారం మునుగోడు రైతు వేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వ్యవసాయ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. వచ్చే వానకాలంలో పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాజమాన్య పద్ధతులు, నాణ్యమైన విత్తనాల ఎంపిక, పంటల్లో వచ్చే చీడపీడల నివారణ, సమస్యాత్మక నేలల యాజమాన్య పద్ధతులను వివరించారు. అలాగే అధిక సాంద్రత పత్తి, వాటి లాభాలు, యాజమాన్య పద్ధతులు, పంట మార్పిడి, పురుగు మందుల పిచికారి విధానం గురించి వివరించారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ రామకృష్ణ బాబు, సాయి ప్రియ, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.