నల్లగొండ, సెప్టెంబర్ 04 : ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంక్ నందు గురువారం మెగా రక్తదాన శిబిరాన్ని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. రక్తదానం వల్ల ఆపదలో రక్తం అవసరమైన వారికి సహాయ పడటమే కాక, రక్తదానం చేయడం పట్ల ఉన్న అపోహలను తొలగించిన వారవుతారన్నారు. సామాజిక సేవ చేయడంలో టీఎస్యూటీఎఫ్ సంఘాన్ని అగ్రగామిగా నిలుపుతున్న ఉపాధ్యాయుల కృషి అభినందనీయమన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి సమాజాన్ని భాగస్వామ్యం చేసుకుని ఉద్యమిస్తున్నట్లు తెలిపారు.
రక్తదాన శిబిరాన్ని నల్లగొండ డీఈఓ బొల్లారం భిక్షపతి సందర్శించి మాట్లాడారు. టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్ రెడ్డి, టీజీఈజేఏసీ నల్లగొండ జిల్లా ఛైర్మన్ నాగిళ్ల మురళి, టీఎస్యూటీఎఫ్ నల్లగొండ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బక్కా శ్రీనివాస చారి, పెరుమాళ్ల వెంకటేశం, టీఎన్జీఓ జిల్లా జనరల్ సెక్రటరీ శేఖర్ రెడ్డి, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు భిక్షం, వార్డెన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రణదేవె, టీఎస్యూటీఎఫ్ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు నర్రా శేఖర్ రెడ్డి, జిల్లా కార్యదర్శులు గేర నర్సింహ, నలపరాజు వెంకన్న, రాచమల్ల రమాదేవి, పగిళ్ల సైదులు, కొమర్రాజు సైదులు, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ ఎం.మురళయ్య, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఎరనాగుల సైదులు, స్టడీ సర్కిల్ కన్వీనర్ రాగి రాకేశ్, టీఎస్యూటీఎఫ్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Nalgonda : ఉపాధ్యాయుల రక్తదానం అభినందనీయం : చావా రవి