మిర్యాలగూడ :కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన స్వచ్ఛభారత్ మిషన్ గ్రామాల్లో అమలవుతున్న పారిశుద్యంపై పౌరుల అభిప్రాయాలను ఆన్లైన్లో నమోదు చేసేందుకు స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్-2021సర్వేను నల్లగొండ జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని స్వచ్ఛ భారత్ మిషన్ జిల్లా కో-ఆర్డినేటర్ శంకర్బాబు కోరారు. మండల సమాఖ్య కార్యాలయంలో వీఓఏలకుతో నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో చేపట్టిన పారిశుద్యం, మరుగు దొడ్ల నిర్మాణం, వాటి వినియోగం, గ్రామాల్లో చెత్త డంపింగ్ యార్డులు, ఇంకుడు గుంతల ఏర్పాటు పని తీరుపై గ్రామాల్లో పౌరుల అభిప్రాయాలను సేకరించి , వాటిని ఆన్లైన్ లో అప్ లోడ్ చేయాలని కోరారు. ఆన్లైన్ చేయడంలో జిల్లాను ముందంజలో ఉంచాలని ,అందుకు వీఓఏలు శ్రమించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీఎంలు జి.కృష్ణమూర్తి, ఎం.శేషయ్య,సీసీలు రాజేష్,అనపూర్ణ, హైమావతి, నాగేందర్, వీఓఏలు పాల్గొన్నారు.