సూర్యాపేట అర్బన్: తెలంగాణ ముద్దుబిడ్డ విశ్వమానవుడు, విశ్వకవి, మహోపాధ్యాయుడు కాళోజీ జీవితం దేశానికి ఆదర్శమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాళోజీ జయంతి, గురు పూజో త్సవ కార్యక్రమంలో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలను అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన జీవిత పయనంలో ఏ సందర్భంలోనూ పదవులకు, డబ్బుకు ఆయన దాసోహం కాలేదని అంతటి మహోన్నత వ్యక్తి ఆశయాలను సాధించాలని అన్నారు. ఆయన లాంటి ఉన్నత మైన వ్యక్తిత్వాలు నేటి తరానికి ఆదర్శంగా చేసుకోవాలని సూచించా రు. కాళోజీ జయంతి సందర్భంగా తెలంగాణ బాషా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నారు. తెలంగాణ అస్థిత్వ కోసం జాతిని జాగృతం చేసిన ప్రజా కవి మహానుబావుడు కాళోజీ అని అన్నారు.
కాళోజీ నారాయణ రావు మ్యూజియం కోసం ,కళాకేంత్రం కోసం తెలంగాణ రాష్ట్రంలో 3ఎకరాల స్థలంతో పాటు 12 కోట్ల రూపాయలను ముఖ్య మంత్రి కేసీఆర్ కేటాయించారని గుర్తు చేశారు. నైతిక విలువలు, మానవత్వం, అంంతరించి పోతున్న తరుణంలో కాళోజీ లాంటి వారు మళ్లీ పుట్టాల ని కోరుకుంటున్నారన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులలో విజ్ఞాన వెలుగులు నింపి క్రమశిక్షణ నేర్పుతూ బంగారు భవిష్యత్కు దారులు వేయాలని సూచించారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారని అన్నారు.
కార్యక్రమంలోఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, జిల్లా పరిషత్ చైర్మన్ దీపిక, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్పిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, ఉపాధ్యాయులు నట్టే శ్రీనివాసరావు, విజయకుమారి, గులాం జహంగీర్, యాస రాంకుమార్ రెడ్డి పాల్గొన్నారు.