సూర్యాపేట సిటీ, మార్చి 21 : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దు వెంట అక్రమ రవాణా జరుగకుండా పటిష్ట నిఘా ఉం చాలని, ఎన్నికల విధుల్లో భాగంగా ఇతర శాఖల సిబ్బందితో టీమ్ వర్క్ చేయాలని ఎస్పీ ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. గురువారం జిల్లా పోలీ సు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కోదాడ సబ్ డివిజన్ పోలీసు అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. డయల్ 100 ఫిర్యాదులపై స్పందన వేగంగా ఉండాలని, బ్లూ కోట్స్ సిబ్బంది విధులు సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.
పెండింగ్ కేసులు వేగంగా దర్యాప్తు చేసి చార్జిషీటు త్వరగా కోర్టులకు పంపించాలని, పలు కేసులకు టెక్నికల్ ఆధారాలను రికార్డు చేసుకోవాలని చెప్పారు. రోడ్డు భద్రత విషయంలో నిత్యం తనిఖీలు చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ కఠినంగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీ నాగేశ్వర్రావు, కోదాడ సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీదర్రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ మట్టయ్య, సైబర్ సెక్యూరిటీ డీఎస్పీ శ్రీనివాస్రావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ పాండరి, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ జితెందర్రెడ్డి, సీఐలు చరమందరాజు, రజితరెడ్డి, రాము, రామకృష్ణారెడ్డి, లక్ష్మీనారాయణ, డీసీఆర్బీ, ఐటీ కోర్ ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.